బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..
పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు
పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య
అక్షరదర్బార్, పరకాల:
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టాపన వ్యవస్థాపక అధ్యక్షులు బొచ్చు అనంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
అనంతరం పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలను అనుసరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల మండలం ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, కౌన్సిలర్లు బొచ్చు మాధవిలత, జాన్సన్, బొచ్చు సుభద్ర, సాల్మన్, పాలకుర్తి శ్రీనివాస్, బొచ్చు శ్యామల బాబురావు, సుధమల్ల రమేష్, కాంగ్రెస్ నాయకులు బొచ్చు మోహన్, బొచ్చు జెమిని, దుప్పటి సదయ్య, ఆయిలిపెళ్లి స్వామి, బండి రాజు, బొచ్చు రాజు, జూపాక దేవమణి, రామన్న తదితరులు పాల్గొన్నారు.