ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..
ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు
అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు
అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత
అక్షరదర్బార్,పరకాల:
పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ‘అక్షర దర్బార్’ పత్రికలో ప్రచురితమైన కథనం ప్రభావంతో మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను తొలగించారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘అక్షర దర్బార్’ పత్రికకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు
మున్సిపల్ కమిషనర్ అంజయ్య
అక్రమ నిర్మాణలను ఉపేక్షించేది లేదని పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య హెచ్చరించారు. పట్టణంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.