టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత 
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత 
- నాలుగు వాహనాలు సీజ్
- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ

అక్షరదర్బార్, భూపాలపల్లి క్రైమ్; పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిన ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాను సివిల్ సప్లై, టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం రాత్రి సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. నాలుగు వాహనాల్లో తరలిస్తున్న 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు నేతృత్వంలో స్వాధీనం చేసుకున్నారు.   గత కొద్ది రోజుల నుండి కొందరు అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది గత కొన్ని రోజుల నుంచి పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై గట్టి "నిఘా" పెట్టారు. ఇందులో భాగంగా నాలుగు వాహనాల్లో రేషన్ బియ్యం తరలిపోతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా నాలుగు వాహనాల్లో అక్రమంగా రవాణా జరుగుతున్న 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని రంగయ్యపల్లె గ్రామ శివారులోని మారుతి రైస్ మిల్ లో భద్రపరిచి నాలుగు వాహనాలను రేగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ అడిషనల్ సూపరిండెంట్ ప్రభాకర్ రావు, సీఐ వసంత కుమార్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సివిల్ సప్లై అధికారులు పి సురేందర్ రెడ్డి, రాజు, వేణు. తదితరులు పాల్గొన్నారు, పట్టుబడిన ఈ రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి, వీటిని తరలిస్తున్నది ఎవరు?, ఎక్కడినుంచి తీసుకెళ్తున్నారనే సమాచారాన్ని తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి 97 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags:

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ అక్షర దర్బార్,పరకాల : మండుటెండలో జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ తోడ్పాటు...
Read More...
చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు