గుండెపోటుతో ఎంపీడీవో మృతి

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

  • చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు
  • వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో

గుండెపోటుతో ఎంపీడీవో మృతి. 

(అక్షరదర్బార్, భూపాలపల్లి క్రైమ్)

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హుస్సేన్ గుండెపోటుతో శనివారం మృతి చెందారు. పరకాల పట్టణ కేంద్రానికి చెందిన మహ్మద్ హుస్సేన్ చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు. చిట్యాల టైపిస్టు నుండి ప్రమోషన్ పొంది సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూనే గత సంవత్సరం మొగుళ్ళపల్లి ఎంపీడీవో గా ప్రమోషన్ పై వచ్చారు. గత సంవత్సరం నుండి మొగుళ్ళ పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ.. గత రెండు మూడు రోజుల నుండి అనారోగ్య కారణాలతో సెలవు పై వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం అస్తవస్థకు గురైన హుస్సేన్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. ఎంపీడీవో హుస్సేన్ మరణ వార్తతో మొగుళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయం బోసిపోయింది. పలువురు ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఎంపీడీవో హుస్సేన్ వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్నట్లు తెలిసింది,

Tags:

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల