గుండెపోటుతో ఎంపీడీవో మృతి

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

  • చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు
  • వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో

గుండెపోటుతో ఎంపీడీవో మృతి. 

(అక్షరదర్బార్, భూపాలపల్లి క్రైమ్)

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హుస్సేన్ గుండెపోటుతో శనివారం మృతి చెందారు. పరకాల పట్టణ కేంద్రానికి చెందిన మహ్మద్ హుస్సేన్ చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు. చిట్యాల టైపిస్టు నుండి ప్రమోషన్ పొంది సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూనే గత సంవత్సరం మొగుళ్ళపల్లి ఎంపీడీవో గా ప్రమోషన్ పై వచ్చారు. గత సంవత్సరం నుండి మొగుళ్ళ పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ.. గత రెండు మూడు రోజుల నుండి అనారోగ్య కారణాలతో సెలవు పై వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం అస్తవస్థకు గురైన హుస్సేన్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. ఎంపీడీవో హుస్సేన్ మరణ వార్తతో మొగుళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయం బోసిపోయింది. పలువురు ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఎంపీడీవో హుస్సేన్ వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్నట్లు తెలిసింది,

Tags:

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బిజెపి మండల అధ్యక్షుడు...
Read More...
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం     శాయంపేట, అక్షర దర్బార్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాయంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి జెండా ఆవిష్కరించారు....
Read More...
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు    అక్షర దర్బార్, శాయంపేట : ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...
Read More...
ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .    - ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"    - రైతులపై కేసులు వద్దు.    - పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.    అక్షరదర్బార్, పరకాల:...
Read More...
రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....   – ప్రజల విజ్ఞప్తి.    అక్షర దర్బార్, పరకాల: నడికూడ మండలంలోని కంటత్మకూర్ వాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వాగు ఉధృతంగా పొంగిపొర్లి...
Read More...
కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....