గుండెపోటుతో ఎంపీడీవో మృతి

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

  • చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు
  • వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో

గుండెపోటుతో ఎంపీడీవో మృతి. 

(అక్షరదర్బార్, భూపాలపల్లి క్రైమ్)

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హుస్సేన్ గుండెపోటుతో శనివారం మృతి చెందారు. పరకాల పట్టణ కేంద్రానికి చెందిన మహ్మద్ హుస్సేన్ చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు. చిట్యాల టైపిస్టు నుండి ప్రమోషన్ పొంది సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూనే గత సంవత్సరం మొగుళ్ళపల్లి ఎంపీడీవో గా ప్రమోషన్ పై వచ్చారు. గత సంవత్సరం నుండి మొగుళ్ళ పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ.. గత రెండు మూడు రోజుల నుండి అనారోగ్య కారణాలతో సెలవు పై వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం అస్తవస్థకు గురైన హుస్సేన్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. ఎంపీడీవో హుస్సేన్ మరణ వార్తతో మొగుళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయం బోసిపోయింది. పలువురు ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఎంపీడీవో హుస్సేన్ వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్నట్లు తెలిసింది,

Tags:

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన