సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

బీఆర్ఎస్‌లో చేరికల జోరు

ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు

అక్షర దర్బార్, పరకాల:
నడికూడ మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి కోడెపాక సుమలత కర్ణాకర్,మాజీ ఎంపిటిసి సమ్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సమక్షంలో వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ తల్లిలాంటి పార్టీ అని, ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే స్వభావం ఉన్న పార్టీగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు.మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పార్టీలో చేరిన నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విరక్తితో ఇప్పటికే భారీగా బీఆర్ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని, స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక మరింత మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

Tags:

మహారాష్ట్రలో పెను విషాదం

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
రాజకీయం 
Read More...
మహారాష్ట్రలో పెను విషాదం

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి