నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్
- తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు
- తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు
- రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత
- వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
అక్షరదర్బార్, ఖమ్మం:
ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని... ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈరోజు సమావేశం... ఒక్కో మండలం వారీగా సమావేశం నిర్వహించిన మంత్రి.... ఈ సందర్భంగా మంత్రి కామెంట్స్
- ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్
- రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించక ఎన్నికల తేదీ పై స్పష్టత ఇస్తాం
- తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
- అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు
- ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలి
- నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి
- ఎన్నికలకు రావడానికి 15రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.... మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వండి
- రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది.
- ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగింది.
- రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ గుంట మొదలుకోని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది.
- సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే
- మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు... వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి