నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....
జారి పడిపోతున్న వాహనదారులు..
పట్టించుకోని గ్రామ కార్యదర్శి.
అక్షర దర్బార్, పరకాల.
నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల నుండి వాటర్ లీకేజీ అవుతూ సీసీ రోడ్డు పైనే నీళ్లు పారుతున్నాయి. దీంతో నాచు ఏర్పడి వాహనదారులు కింద పడిపోతున్నారు. ఈ సమస్యపై గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని గొల్లవాడ వాసులు పేర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలపై కార్యదర్శికి పట్టింపులేదని ఇప్పటివరకే ఆ దారి వెంబడి వెళ్లిన పలు వాహనదారులు జారీ పడి గాయాల పాలనట్లు పలువురు తెలుపుతున్నారు. ఇంత జరుగుతున్న గ్రామ కార్యదర్శి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కార్యదర్శి గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.