బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

  • మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు
  • గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌
  • సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు క‌ల‌క‌లంరేపాయి. గతంలో మ‌హబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారిగా పని చేస్తూ అవినీతి ఆరోప‌ణ‌ల‌పై అరెస్టై స‌స్పెన్ష‌న్‌కు గురైన గౌస్ పాషా ఇంట్లో శుక్ర‌వారం ఉద‌యం అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం  అద్దె ఇంట్లో నివాసం ఉంటుండ‌గా అధికారుల‌ సోదాలు కొన‌సాగుతున్నాయి. 2024 ఆగ‌స్టులో మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషాపై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో, ఏసీబీ అధికారులు గౌస్ పాషాను అదుపులోకి తీసుకుని విచారించారు. మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై దాడులు నిర్వహించి, గౌస్ పాషా ఇతర ఏజెంట్ల వద్ద రూ. 61,600 నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3 కోట్ల‌కుపైగా అక్ర‌మాస్తులు కూడ‌బెట్టిన‌ట్లు గ‌తంలో అధికారులు గుర్తించారు. తాజాగా మ‌రోమారు దాడులు నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయ‌మైంది. 

Tags:

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.  అక్షర దర్బార్, శాయంపేట:శాయంపేటలో...
Read More...
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.