పేలిన మందుపాతర

పేలిన మందుపాతర

  • ముగ్గురు పోలీసుల దుర్మరణం
  • మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు?
  • బీజాపూర్ జిల్లాలో ఘటన

పేలిన మందుపాతర 
- ముగ్గురు పోలీసులు దుర్మరణం 
- బీజాపూర్ జిల్లాలో ఘటన

అక్షరదర్బార్, వాజేడు: తెలంగాణ- ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దులోని బీజాపూర్ జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో మందు పాతర పేలటంతో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజుల నుంచి తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు జరుపుతున్నారు. ఇప్పటివరకు మావోయిస్టులు అమర్చిన సుమారు 200 మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో లంకపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మందు పాతర పేలడంతో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా ఒక ఎస్సై గాయపడినట్లు సమాచారం. మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు శ్రీధర్, సందీప్, పవణ్ కళ్యాణ్. వీరి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఎస్సై రణధీర్ స్వగ్రామం వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని పైడిపల్లి అని తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఇతన్ని హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.  మందు పాతర మృతులకు నివాళి అర్పించేందుకు వరంగల్ కు డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు. గతంలో కూడా కర్రెగుట్టపై, పరిసరాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు, ఐఈడీలు పేలిన విషయం తెలిసిందే. లంకపల్లి మందుపాతర పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు* *సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు* అక్షర దర్బార్ శాయంపేట : ఉపాధి హామీ పథకం పనిలో...
Read More...
రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

ఏసీబీ పంజా

లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్ అరెస్టు, విచారణ
క్రైమ్ 
Read More...
ఏసీబీ పంజా

దామెరలో గంజాయి పట్టివేత..

దామెరలో గంజాయి పట్టివేత.. 210 గ్రాములు స్వాధీనం   ఇద్దరు యువకులు అరెస్ట్ అక్షరదర్బార్, పరకాల:దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు...
Read More...
దామెరలో గంజాయి పట్టివేత..

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

  బాబు జగ్జీవన్ రామ్ జయంతి .. పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య అక్షరదర్బార్,...
Read More...
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు   అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత అక్షరదర్బార్,పరకాల: పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా...
Read More...
ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..