పేలిన మందుపాతర

పేలిన మందుపాతర

  • ముగ్గురు పోలీసుల దుర్మరణం
  • మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు?
  • బీజాపూర్ జిల్లాలో ఘటన

పేలిన మందుపాతర 
- ముగ్గురు పోలీసులు దుర్మరణం 
- బీజాపూర్ జిల్లాలో ఘటన

అక్షరదర్బార్, వాజేడు: తెలంగాణ- ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దులోని బీజాపూర్ జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో మందు పాతర పేలటంతో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజుల నుంచి తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు జరుపుతున్నారు. ఇప్పటివరకు మావోయిస్టులు అమర్చిన సుమారు 200 మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో లంకపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మందు పాతర పేలడంతో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా ఒక ఎస్సై గాయపడినట్లు సమాచారం. మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు శ్రీధర్, సందీప్, పవణ్ కళ్యాణ్. వీరి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఎస్సై రణధీర్ స్వగ్రామం వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని పైడిపల్లి అని తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఇతన్ని హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.  మందు పాతర మృతులకు నివాళి అర్పించేందుకు వరంగల్ కు డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు. గతంలో కూడా కర్రెగుట్టపై, పరిసరాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు, ఐఈడీలు పేలిన విషయం తెలిసిందే. లంకపల్లి మందుపాతర పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర