పేలిన మందుపాతర

పేలిన మందుపాతర

  • ముగ్గురు పోలీసుల దుర్మరణం
  • మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు?
  • బీజాపూర్ జిల్లాలో ఘటన

పేలిన మందుపాతర 
- ముగ్గురు పోలీసులు దుర్మరణం 
- బీజాపూర్ జిల్లాలో ఘటన

అక్షరదర్బార్, వాజేడు: తెలంగాణ- ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దులోని బీజాపూర్ జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో మందు పాతర పేలటంతో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజుల నుంచి తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు జరుపుతున్నారు. ఇప్పటివరకు మావోయిస్టులు అమర్చిన సుమారు 200 మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో లంకపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మందు పాతర పేలడంతో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా ఒక ఎస్సై గాయపడినట్లు సమాచారం. మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు శ్రీధర్, సందీప్, పవణ్ కళ్యాణ్. వీరి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఎస్సై రణధీర్ స్వగ్రామం వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని పైడిపల్లి అని తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఇతన్ని హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.  మందు పాతర మృతులకు నివాళి అర్పించేందుకు వరంగల్ కు డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు. గతంలో కూడా కర్రెగుట్టపై, పరిసరాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు, ఐఈడీలు పేలిన విషయం తెలిసిందే. లంకపల్లి మందుపాతర పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి బీఆర్ఎస్‌లో చేరికల జోరు ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు అక్షర దర్బార్, పరకాల:నడికూడ మండలానికి చెందిన మాజీ...
Read More...
సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి