పేలిన మందుపాతర

పేలిన మందుపాతర

  • ముగ్గురు పోలీసుల దుర్మరణం
  • మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు?
  • బీజాపూర్ జిల్లాలో ఘటన

పేలిన మందుపాతర 
- ముగ్గురు పోలీసులు దుర్మరణం 
- బీజాపూర్ జిల్లాలో ఘటన

అక్షరదర్బార్, వాజేడు: తెలంగాణ- ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దులోని బీజాపూర్ జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో మందు పాతర పేలటంతో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజుల నుంచి తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు జరుపుతున్నారు. ఇప్పటివరకు మావోయిస్టులు అమర్చిన సుమారు 200 మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో లంకపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మందు పాతర పేలడంతో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా ఒక ఎస్సై గాయపడినట్లు సమాచారం. మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు శ్రీధర్, సందీప్, పవణ్ కళ్యాణ్. వీరి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఎస్సై రణధీర్ స్వగ్రామం వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని పైడిపల్లి అని తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఇతన్ని హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.  మందు పాతర మృతులకు నివాళి అర్పించేందుకు వరంగల్ కు డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు. గతంలో కూడా కర్రెగుట్టపై, పరిసరాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు, ఐఈడీలు పేలిన విషయం తెలిసిందే. లంకపల్లి మందుపాతర పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..