ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

  • IMG-20250308-WA0017బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు 
  • కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు
  • వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం
  • గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు

 

అక్షరదర్బార్, వరంగల్:

మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం మేచ‌రాజుప‌ల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమార‌పు ప్ర‌వీణ్ (30)తోపాటు ఆయ‌న కూతురు ఎస్సారెస్పీ కెనాల్‌లో ప‌డి గ‌ల్లంత‌య్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు చిన్నారి సాయివర్దన్ (2) మృతి చెందగా భార్య ను స్థానికులు కాపాడారు. వ‌రంగ‌ల్‌లో నివాసం ఉంటున్న ప్ర‌వీణ్ భార్య ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి వ‌రంగ‌ల్ నుంచి కారులో స్వ‌గ్రామానికి వెళ్తున్నారు. ఈక్ర‌మంలోనే సంగెం మండ‌లం తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ప్ర‌మాద‌వ‌శాత్తు ఎస్సారెస్పీ కెనాల్‌లో వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. దీంతో ప్ర‌వీణ్‌, ఆయ‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు నీటిలో మునిగిపోయారు. గ‌మ‌నించిన స్థానికులు తాడు సాయంతో భార్య‌ కృష్ణవేణిని కాపాడారు. అప్పటికే బాలుడు సాయివర్దన్ మరణించాడు. ప్రవీణ్, ఆయన కూతురు చైత్ర సాయి (4) కారు సహా నీటిలో గ‌ల్లంత‌య్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సోమారపు ప్రవీణ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని తెలిసింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.IMG-20250308-WA0015

WhatsApp Image 2025-03-08 at 1.20.48 PM

Tags:

'మహా' రూపురేఖలు

- మల్టీ లెవెల్ పార్కింగ్ నుంచి మెగా డ్రైనేజీ ప్రాజెక్టు వరకు!
వార్తలు 
Read More...
'మహా' రూపురేఖలు

కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!

కాలేజీ గ్రౌండా.. నీటి! చినుకు పడితే చిత్తడే..  విద్యార్థులు, వాకర్లకు తీవ్ర ఇబ్బందులు ఎలిఫ్యాడ్‌ కోసం వేసిన సీసీని తొలగించకుండా వదిలేయడంతో సమస్య అక్షరదర్బార్, పరకాల:పరకాల...
Read More...
కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి   గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి అక్షరదర్బార్,పరకాల:  సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బీజేపీ...
Read More...
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!