ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

  • IMG-20250308-WA0017బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు 
  • కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు
  • వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం
  • గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు

 

అక్షరదర్బార్, వరంగల్:

మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం మేచ‌రాజుప‌ల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమార‌పు ప్ర‌వీణ్ (30)తోపాటు ఆయ‌న కూతురు ఎస్సారెస్పీ కెనాల్‌లో ప‌డి గ‌ల్లంత‌య్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు చిన్నారి సాయివర్దన్ (2) మృతి చెందగా భార్య ను స్థానికులు కాపాడారు. వ‌రంగ‌ల్‌లో నివాసం ఉంటున్న ప్ర‌వీణ్ భార్య ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి వ‌రంగ‌ల్ నుంచి కారులో స్వ‌గ్రామానికి వెళ్తున్నారు. ఈక్ర‌మంలోనే సంగెం మండ‌లం తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ప్ర‌మాద‌వ‌శాత్తు ఎస్సారెస్పీ కెనాల్‌లో వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. దీంతో ప్ర‌వీణ్‌, ఆయ‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు నీటిలో మునిగిపోయారు. గ‌మ‌నించిన స్థానికులు తాడు సాయంతో భార్య‌ కృష్ణవేణిని కాపాడారు. అప్పటికే బాలుడు సాయివర్దన్ మరణించాడు. ప్రవీణ్, ఆయన కూతురు చైత్ర సాయి (4) కారు సహా నీటిలో గ‌ల్లంత‌య్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సోమారపు ప్రవీణ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని తెలిసింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.IMG-20250308-WA0015

WhatsApp Image 2025-03-08 at 1.20.48 PM

Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర