21 మంది ఐపీఎస్ ల బదిలీ
- సీపీలు, ఎస్పీలకు స్థానచలనం
- వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్
- అంబర్ కిషోర్ ఝా రామగుండం సీపీగా బదిలీ
- కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
అక్షరదర్బార్, వరంగల్
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. బదిలీ అయిన వారిలో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, మరో ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కలిగింది. 14 మంది ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఇన్నాళ్లు పనిచేసిన అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ గా బదిలీ కాగా, ఆయన స్థానంలో సన్ ప్రీత్ సింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం నియమితులయ్యారు. ఎమ్మెల్సీ టీచర్స్, పట్టభద్రుల ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో మొదట ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది.



