- ఐఈడీ బాంబుతో భద్రతా బలగాల వాహనం పేల్చివేత
- 8 మంది జవాన్లు, డ్రైవర్ మృతి
- మరికొందరికి తీవ్ర గాయాలు
- ధృవీకరించిన బస్తర్ ఐజీ
అక్షరదర్బార్, ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో 8 మంది భద్రతా సిబ్బంది, ఒక డ్రైవర్ చనిపోయారని సమాచారం. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఐదుగురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. బీజాపుర్ జిల్లాలోని బడ్రె - కుట్రు రహదారిలో ఈ ఘటన జరిగినట్లు బస్తర్ ఐజీ ధృవీకరించారు. మందుపాతర పేలిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం.