మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....
తీవ్ర

ఇబ్బందులకు గురవుతున్న మహిళలు.
పట్టించుకోని లేబర్ కార్యాలయం..
అక్షర దర్బార్, పరకాల.
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిగువ మధ్యతరగతి పేద ప్రజలకు లేబర్ కార్యాలయం ఉచిత రక్త, మూత్ర పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాధులను గుర్తించి వారికి తగిన మెడిసిన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసింది. కానీ ఈ క్యాంపులో మహిళలకు ఎటువంటి మూత్రశాలలు లేకపోవడంతో వారు మూత్ర పరీక్షలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పరకాల పట్టణ బిజెపి అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కార్యాలయం ఏర్పాటుచేసిన క్యాంపులో వసతులు ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాల్సిన లేబర్ కార్యాలయం ఎందుకు పట్టించుకోవడంలేదని పేదలపై ఇంత చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎక్కడ క్యాంపు ఏర్పాటుచేసిన మహిళలకు, ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు.