కానిస్టేబుళ్ల ఆత్మహత్య

కానిస్టేబుళ్ల ఆత్మహత్య

  • ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సూసైడ్
  • మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ 
  • మరొకరు బెటాలియన్ కానిస్టేబుల్ 
  • మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం

ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య
- మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ 
- మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం

అక్షరదర్బార్, మెదక్:
వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, మరొకరు 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే... ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి నుంచి పోలీసు స్టేషన్ కు వచ్చిన సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సాయికుమార్ తన కుమార్తెకు ఫోన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ బలవన్మరణంపై మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. 

సిద్దిపేట వద్ద 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వీరిలో కానిస్టేబుల్ బాలకృష్ణ చనిపోయాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంటి కోసం బాలకృష్ణ అప్పు చేసినట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆత్మహత్యతో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం అలుముకుంది.IMG-20241229-WA0015

Tags:

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాలలో ఒక్కసారిగా మంటలు

పరకాలలో ఒక్కసారిగా మంటలు సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో...
Read More...
పరకాలలో ఒక్కసారిగా మంటలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం