కానిస్టేబుళ్ల ఆత్మహత్య

కానిస్టేబుళ్ల ఆత్మహత్య

  • ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సూసైడ్
  • మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ 
  • మరొకరు బెటాలియన్ కానిస్టేబుల్ 
  • మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం

ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య
- మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ 
- మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం

అక్షరదర్బార్, మెదక్:
వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, మరొకరు 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే... ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి నుంచి పోలీసు స్టేషన్ కు వచ్చిన సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సాయికుమార్ తన కుమార్తెకు ఫోన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ బలవన్మరణంపై మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. 

సిద్దిపేట వద్ద 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వీరిలో కానిస్టేబుల్ బాలకృష్ణ చనిపోయాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంటి కోసం బాలకృష్ణ అప్పు చేసినట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆత్మహత్యతో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం అలుముకుంది.IMG-20241229-WA0015

Tags:

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్

దొంగతనం కేసు ఛేదన

దొంగతనం కేసు ఛేదన ఆరుగురు నిందితుల అరెస్టు.. రూ.1.50 లక్షల నగదు స్వాధీనం అక్షరదర్బార్, కాళేశ్వరం: గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం...
Read More...
దొంగతనం కేసు ఛేదన

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
Read More...
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. పరారీలో నిందితుడు  అక్షరదర్బార్, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో...
Read More...
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

మహిళా ఉద్యోగులకు వేధింపులు

మహిళా ఉద్యోగులకు వేధింపులు  - ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం - ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ...
Read More...
మహిళా ఉద్యోగులకు వేధింపులు