బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?

బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?

  • కేబినెట్ స‌బ్ క‌మిటీకి నివేదిక అంద‌జేత‌
  • ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ
  • అదేరోజు అసెంబ్లీ ప్ర‌త్యేక‌ స‌మావేశంలో ఆమోద ముద్ర‌

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85 శాతం ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. దీంతోపాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. ఈమేర‌కు సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేశారు. కేబినెట్ స‌బ్ క‌మిటీ చైర్మ‌న్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సచివాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్లానింగ్ క‌మిష‌న్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సందీప్ సుల్తానియా బృందం కేబినెట్ స‌బ్ క‌మిటీకి కుల గ‌ణ‌న నివేదికను అంద‌జేసింది. కాగా, ఈనెల 5న కేబినెట్ ముందుకు కుల గ‌ణ‌న నివేదిక రానుంది. మంత్రివ‌ర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి.. కేంద్రానికి పంపనున్నారు.

 

Tags:

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

ఏసీబీ ట్రాప్  అక్షరదర్బార్, హనుమకొండ  హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని రూ.60000 లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ లోని తన  కార్యాలయంలో...
Read More...
  ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.  అక్షర దర్బార్, శాయంపేట:శాయంపేటలో...
Read More...
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి