బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?

బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?

  • కేబినెట్ స‌బ్ క‌మిటీకి నివేదిక అంద‌జేత‌
  • ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ
  • అదేరోజు అసెంబ్లీ ప్ర‌త్యేక‌ స‌మావేశంలో ఆమోద ముద్ర‌

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85 శాతం ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. దీంతోపాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. ఈమేర‌కు సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేశారు. కేబినెట్ స‌బ్ క‌మిటీ చైర్మ‌న్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సచివాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్లానింగ్ క‌మిష‌న్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సందీప్ సుల్తానియా బృందం కేబినెట్ స‌బ్ క‌మిటీకి కుల గ‌ణ‌న నివేదికను అంద‌జేసింది. కాగా, ఈనెల 5న కేబినెట్ ముందుకు కుల గ‌ణ‌న నివేదిక రానుంది. మంత్రివ‌ర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి.. కేంద్రానికి పంపనున్నారు.

 

Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు