తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌ 

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌ 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేస్తూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 5న తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై మ‌ల్ల‌న్న‌ను క‌మిటీ వివ‌ర‌ణ కోరింది. ఫిబ్ర‌వ‌రి 12వ తేదీలోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ గ‌డువు ఇచ్చింది. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంతో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్ల‌గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న ఇటీవ‌ల కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న కొంతకాలంగా వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. అలాగే ఇతర కులాలపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.  ఈ నేపథ్యంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.WhatsApp Image 2025-03-01 at 12.50.04 PM

Tags:

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన