కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.
 
భూపాలపల్లి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ.
 
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.
 
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్.
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలోని  ప్రగతి సింగారం గ్రామంలో సిరికొండ ప్రశాంత్ విలేకరుల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రస్థాయిలో వ్యతిరేకత ఉందని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవాలనే తప్ప ప్రజలకు ప్రసన్నం చేసుకోవాలని లేదని, వ్యక్తిగత లాభం, గాంధీ కుటుంబం లాభం తప్ప ప్రజల లాభం చూడటం లేదని జనాలకు మంచి చేయాలని సోయి కూడా ఉండటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు.
 
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.
 
భూపాలపల్లి నియోజకవర్గం అంటే తెలంగాణ ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ అని అధికారం పోయిందని మంచి రోజులు వస్తాయని కార్యకర్తలను కాపాడుకోవాలి కానీ ఫోన్ చేసి మరి వేరే పార్టీలోకి వెళ్లిపోతుంటే భూపాలపల్లిలో టిఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని కొందరు నాయకులు ఉన్నారని, బిఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి ఈ పార్టీ నుంచి వెళ్లిపోయి వేరే పార్టీలోకి పోటీ చేయాలి. ఈ పార్టీని పొమ్మనకుండా పొగబెట్టాలి బలమైన పార్టీని నిర్వీణ్యం చేయాలని కొందరు నాయకులు ఉన్నారని విమర్శించారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా భూపాలపల్లికి సిరికొండ మధుసూదనా చారి వస్తాడని భూపాలపల్లికి రావద్దు అంటూ ఎవరు ఆంక్షలు పెట్టలేదని పెట్టరు కూడా అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీతో మాతో 20 ఏళ్ల అనుబంధం ఉందని ఈ పార్టీతోనే ఉంటామని ఈ పార్టీలోనే చచ్చిపోతామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని భూపాలపల్లిలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కాపాడుకుంటామని భూపాలపల్లిని సిరికొండ మధుసూదన చారికి విడదీసి చూడలేమని అన్నారు. శత్రువుల పాతికలు పారిచ్చేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దూలం నాగరాజు, మాజీ ఎంపీటీసీ బగ్గిరమేష్, నాయకులు పోతూ రమణారెడ్డి, రాకేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250128-WA1212
Tags:

ఉద్యోగమంటూ ఘరానా మోసం

- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్
క్రైమ్ 
Read More...
ఉద్యోగమంటూ ఘరానా మోసం

స్కీంలు కాదు.. సీట్లు కావాలి

- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
వార్తలు 
Read More...
స్కీంలు కాదు.. సీట్లు కావాలి

కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ 

కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ  - జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేయకుండా నిల్చున్న పవన్ - మరోసారి చర్చనీయం అక్షరదర్బార్,పరకాల: జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల...
Read More...
కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ 

'మహా' రూపురేఖలు

- మల్టీ లెవెల్ పార్కింగ్ నుంచి మెగా డ్రైనేజీ ప్రాజెక్టు వరకు!
వార్తలు 
Read More...
'మహా' రూపురేఖలు

కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!

కాలేజీ గ్రౌండా.. నీటి! చినుకు పడితే చిత్తడే..  విద్యార్థులు, వాకర్లకు తీవ్ర ఇబ్బందులు ఎలిఫ్యాడ్‌ కోసం వేసిన సీసీని తొలగించకుండా వదిలేయడంతో సమస్య అక్షరదర్బార్, పరకాల:పరకాల...
Read More...
కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!