కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.
 
భూపాలపల్లి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ.
 
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.
 
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్.
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలోని  ప్రగతి సింగారం గ్రామంలో సిరికొండ ప్రశాంత్ విలేకరుల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రస్థాయిలో వ్యతిరేకత ఉందని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవాలనే తప్ప ప్రజలకు ప్రసన్నం చేసుకోవాలని లేదని, వ్యక్తిగత లాభం, గాంధీ కుటుంబం లాభం తప్ప ప్రజల లాభం చూడటం లేదని జనాలకు మంచి చేయాలని సోయి కూడా ఉండటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు.
 
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.
 
భూపాలపల్లి నియోజకవర్గం అంటే తెలంగాణ ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ అని అధికారం పోయిందని మంచి రోజులు వస్తాయని కార్యకర్తలను కాపాడుకోవాలి కానీ ఫోన్ చేసి మరి వేరే పార్టీలోకి వెళ్లిపోతుంటే భూపాలపల్లిలో టిఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని కొందరు నాయకులు ఉన్నారని, బిఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి ఈ పార్టీ నుంచి వెళ్లిపోయి వేరే పార్టీలోకి పోటీ చేయాలి. ఈ పార్టీని పొమ్మనకుండా పొగబెట్టాలి బలమైన పార్టీని నిర్వీణ్యం చేయాలని కొందరు నాయకులు ఉన్నారని విమర్శించారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా భూపాలపల్లికి సిరికొండ మధుసూదనా చారి వస్తాడని భూపాలపల్లికి రావద్దు అంటూ ఎవరు ఆంక్షలు పెట్టలేదని పెట్టరు కూడా అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీతో మాతో 20 ఏళ్ల అనుబంధం ఉందని ఈ పార్టీతోనే ఉంటామని ఈ పార్టీలోనే చచ్చిపోతామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని భూపాలపల్లిలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కాపాడుకుంటామని భూపాలపల్లిని సిరికొండ మధుసూదన చారికి విడదీసి చూడలేమని అన్నారు. శత్రువుల పాతికలు పారిచ్చేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దూలం నాగరాజు, మాజీ ఎంపీటీసీ బగ్గిరమేష్, నాయకులు పోతూ రమణారెడ్డి, రాకేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250128-WA1212
Tags:

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరంలో 132 మంది రక్తదానం..  రక్తదాతలకు టీ-షర్టుల పంపిణీ..   ఘనంగా అన్నదానం అక్షరదర్బార్,పరకాల: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల...
Read More...
సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

పరకాలను అభివృద్ధి చేయాలి

పరకాలను అభివృద్ధి చేయాలి సీఎం సభకు రూ.30 లక్షలు ఖర్చు..  పరకాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ పోచంపల్లి...
Read More...
పరకాలను అభివృద్ధి చేయాలి

ప్రశ్నించటమే నా బలం

- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో ఉన్న.. నిర్బంధాలే నన్ను నిలబెట్టాయి- అప్పట్లో నా రాజకీయ గురువు సుధాకర్ గాంధీ- కాంగ్రెసే నా...
రాజకీయం 
Read More...
ప్రశ్నించటమే నా బలం

హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు

- పట్టుబట్టి నన్ను బర్తరఫ్‌ చేయించారు- సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఆరోపణలు - తన కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారని నిలదీత...
రాజకీయం 
Read More...
హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు