కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.
 
భూపాలపల్లి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ.
 
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.
 
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్.
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలోని  ప్రగతి సింగారం గ్రామంలో సిరికొండ ప్రశాంత్ విలేకరుల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రస్థాయిలో వ్యతిరేకత ఉందని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవాలనే తప్ప ప్రజలకు ప్రసన్నం చేసుకోవాలని లేదని, వ్యక్తిగత లాభం, గాంధీ కుటుంబం లాభం తప్ప ప్రజల లాభం చూడటం లేదని జనాలకు మంచి చేయాలని సోయి కూడా ఉండటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు.
 
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.
 
భూపాలపల్లి నియోజకవర్గం అంటే తెలంగాణ ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ అని అధికారం పోయిందని మంచి రోజులు వస్తాయని కార్యకర్తలను కాపాడుకోవాలి కానీ ఫోన్ చేసి మరి వేరే పార్టీలోకి వెళ్లిపోతుంటే భూపాలపల్లిలో టిఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని కొందరు నాయకులు ఉన్నారని, బిఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి ఈ పార్టీ నుంచి వెళ్లిపోయి వేరే పార్టీలోకి పోటీ చేయాలి. ఈ పార్టీని పొమ్మనకుండా పొగబెట్టాలి బలమైన పార్టీని నిర్వీణ్యం చేయాలని కొందరు నాయకులు ఉన్నారని విమర్శించారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా భూపాలపల్లికి సిరికొండ మధుసూదనా చారి వస్తాడని భూపాలపల్లికి రావద్దు అంటూ ఎవరు ఆంక్షలు పెట్టలేదని పెట్టరు కూడా అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీతో మాతో 20 ఏళ్ల అనుబంధం ఉందని ఈ పార్టీతోనే ఉంటామని ఈ పార్టీలోనే చచ్చిపోతామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని భూపాలపల్లిలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కాపాడుకుంటామని భూపాలపల్లిని సిరికొండ మధుసూదన చారికి విడదీసి చూడలేమని అన్నారు. శత్రువుల పాతికలు పారిచ్చేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దూలం నాగరాజు, మాజీ ఎంపీటీసీ బగ్గిరమేష్, నాయకులు పోతూ రమణారెడ్డి, రాకేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250128-WA1212
Tags:

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యాక్సిడెంట్ లో ఒకరి మృతి

- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి. - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు
క్రైమ్ 
Read More...
యాక్సిడెంట్ లో ఒకరి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి..

వడదెబ్బతో వ్యక్తి మృతి శాయంపేట, అక్షర దర్బార్: భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు...
Read More...
వడదెబ్బతో వ్యక్తి మృతి..