ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

  • ఓ వ్యాపారి నుంచి రూ.3 లక్షల లంచం డిమాండ్
  • రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి యాక్సెప్ట్ 
  • రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, పీసీ 
  • సూర్యాపేట జిల్లాలో ఘటన 

అక్షరదర్బార్,సూర్యాపేట:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచావతారాలపై నిఘా పెట్టి దాడులకు దిగుతున్నారు. పని కోసం లంచం తీసుకుంటున్న ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులను పట్టుకుంటున్నారు. తాజాగా మంగళవారం సూర్యాపేట జిల్లాలో వల వేశారు. ఓ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)రైస్ కేసులో ఎస్సై సురేష్ ఓ వ్యాపారిని రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.

Tags:

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య

ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం  మొదట ప్రమాణం చేసిన మౌనిక    ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార...
Read More...
ప్రమాణ స్వీకారం 

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు  22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3 మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న...
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ వశమైన పరకాల

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 
Read More...
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి