ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

  • ఓ వ్యాపారి నుంచి రూ.3 లక్షల లంచం డిమాండ్
  • రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి యాక్సెప్ట్ 
  • రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, పీసీ 
  • సూర్యాపేట జిల్లాలో ఘటన 

అక్షరదర్బార్,సూర్యాపేట:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచావతారాలపై నిఘా పెట్టి దాడులకు దిగుతున్నారు. పని కోసం లంచం తీసుకుంటున్న ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులను పట్టుకుంటున్నారు. తాజాగా మంగళవారం సూర్యాపేట జిల్లాలో వల వేశారు. ఓ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)రైస్ కేసులో ఎస్సై సురేష్ ఓ వ్యాపారిని రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.

Tags:

లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం 
క్రైమ్ 
Read More...
లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు - రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు  మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ అక్షరదర్బార్, పరకాల :పరకాల ఎమ్మెల్యే...
Read More...
ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు..  - 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
వార్తలు 
Read More...
నిషేధిత కలుపు మందు స్వాధీనం

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం