ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

  • ఓ వ్యాపారి నుంచి రూ.3 లక్షల లంచం డిమాండ్
  • రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి యాక్సెప్ట్ 
  • రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, పీసీ 
  • సూర్యాపేట జిల్లాలో ఘటన 

అక్షరదర్బార్,సూర్యాపేట:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచావతారాలపై నిఘా పెట్టి దాడులకు దిగుతున్నారు. పని కోసం లంచం తీసుకుంటున్న ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులను పట్టుకుంటున్నారు. తాజాగా మంగళవారం సూర్యాపేట జిల్లాలో వల వేశారు. ఓ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)రైస్ కేసులో ఎస్సై సురేష్ ఓ వ్యాపారిని రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.

Tags:

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ అక్షర దర్బార్,పరకాల : మండుటెండలో జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ తోడ్పాటు...
Read More...
చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు