ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

  • ఓ వ్యాపారి నుంచి రూ.3 లక్షల లంచం డిమాండ్
  • రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి యాక్సెప్ట్ 
  • రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, పీసీ 
  • సూర్యాపేట జిల్లాలో ఘటన 

అక్షరదర్బార్,సూర్యాపేట:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచావతారాలపై నిఘా పెట్టి దాడులకు దిగుతున్నారు. పని కోసం లంచం తీసుకుంటున్న ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులను పట్టుకుంటున్నారు. తాజాగా మంగళవారం సూర్యాపేట జిల్లాలో వల వేశారు. ఓ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)రైస్ కేసులో ఎస్సై సురేష్ ఓ వ్యాపారిని రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.

Tags:

ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు విచారణలో ఆరోపణలు నిర్ధారణ 
క్రైమ్ 
Read More...
ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’ అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త హత్య..  చలువాయి వద్ద శవం ఆనవాళ్లు?  పోలీసులు దర్యాప్తు ముమ్మరం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలో...
Read More...
పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

భర్తను హత్య చేసిన భార్య!

పరకాలలో సినీ పక్కిని తలపించే రీతిలో ఘోరం వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తితో కలిసి దారుణం  పోలీసు స్టేషన్ కు చేరుకున్న మృతుడి బంధువులు
క్రైమ్ 
Read More...
భర్తను హత్య చేసిన భార్య!

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు* *సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు* అక్షర దర్బార్ శాయంపేట : ఉపాధి హామీ పథకం పనిలో...
Read More...
రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

ఏసీబీ పంజా

లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్ అరెస్టు, విచారణ
క్రైమ్ 
Read More...
ఏసీబీ పంజా