పరువు నష్టం దావా వేస్తా..

పరువు నష్టం దావా వేస్తా..

  • కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ బురద జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి
  • కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా..
  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ: కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం అవుతోందని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇంటికి వెళ్లినట్టు జ‌రుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని నా ప్రమేయం లేకుండా ఫొటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానన్నారు. దీని వెనకాల ఉన్నవాళ్లను తప్పకుండా శిక్షించాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకులు, వారు సంపాదించిన అక్రమ సంపాదనలో కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కోడిగుడ్డు పై ఈకలు పీకే చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని, వారేమైన బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్లారా అని ప్రశ్నించారు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని. ఇలాంటి విషయాలపై సమగ్ర విచారణ జరిగిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. ముఖ్యంగా ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టు ద్వారా పరువునష్టం దావాలు వేస్తున్నానని నాయిని స్పష్టం చేశారు.

 

Tags:

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య

ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం  మొదట ప్రమాణం చేసిన మౌనిక    ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార...
Read More...
ప్రమాణ స్వీకారం 

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు  22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3 మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న...
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ వశమైన పరకాల

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 
Read More...
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి