పరువు నష్టం దావా వేస్తా..

పరువు నష్టం దావా వేస్తా..

  • కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ బురద జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి
  • కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా..
  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ: కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం అవుతోందని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇంటికి వెళ్లినట్టు జ‌రుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని నా ప్రమేయం లేకుండా ఫొటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానన్నారు. దీని వెనకాల ఉన్నవాళ్లను తప్పకుండా శిక్షించాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకులు, వారు సంపాదించిన అక్రమ సంపాదనలో కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కోడిగుడ్డు పై ఈకలు పీకే చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని, వారేమైన బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్లారా అని ప్రశ్నించారు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని. ఇలాంటి విషయాలపై సమగ్ర విచారణ జరిగిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. ముఖ్యంగా ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టు ద్వారా పరువునష్టం దావాలు వేస్తున్నానని నాయిని స్పష్టం చేశారు.

 

Tags:

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బిజెపి మండల అధ్యక్షుడు...
Read More...
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం     శాయంపేట, అక్షర దర్బార్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాయంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి జెండా ఆవిష్కరించారు....
Read More...
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు    అక్షర దర్బార్, శాయంపేట : ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...
Read More...
ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .    - ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"    - రైతులపై కేసులు వద్దు.    - పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.    అక్షరదర్బార్, పరకాల:...
Read More...
రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....   – ప్రజల విజ్ఞప్తి.    అక్షర దర్బార్, పరకాల: నడికూడ మండలంలోని కంటత్మకూర్ వాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వాగు ఉధృతంగా పొంగిపొర్లి...
Read More...
కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....