వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

  • నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌
  • ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ 
  • ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు
  • ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు 
  • అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం !
  • దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన ప్ర‌భుత్వం..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రవాణా శాఖ కార్యాలయ పక్షాళ‌నపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కోట్లల్లో అక్రమస్తులు కూడ‌పెట్టినట్లు గుర్తించి ఆయ‌న్ను అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే ఇవాళ వ‌రంగ‌ల్ డీటీవోగా పని చేస్తున్న లక్ష్మీపై వేటు ప‌డింది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఆమెను రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వ‌హించ‌డంతోపాటు అవినీతి ఆరోపణల నేప‌థ్యంలో డీటీవోపై వేటు వేసినట్లు తెలుస్తోంది. గతంలో డీటీవో లక్ష్మికి వరంగల్ కలెక్టర్ నుంచి షోకాస్ నోటీసులు సైతం అందాయి. తాజాగా ఆమెను డీటీవోగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీకావడం కలకలం రేపుతోంది. వరంగల్ ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Tags:

ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు వడ్డేపల్లి సబ్...
క్రైమ్ 
Read More...
ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

ఏసీబీ అధికారుల సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన 
వార్తలు 
Read More...
ఏసీబీ అధికారుల సోదాలు

బర్త్ డే వేడుకల్లో విషాదం

స్విమ్మింగ్ పూల్ లో  పడి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి హనుమకొండ జిల్లాలో ఘటన 
క్రైమ్ 
Read More...
బర్త్ డే వేడుకల్లో విషాదం

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.... ఐదుగురు అదుపులోకి…  నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట...
Read More...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి అక్షర దర్బార్,పరకాల: పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే రేవూరి...
Read More...
ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి