వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

  • నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌
  • ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ 
  • ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు
  • ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు 
  • అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం !
  • దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన ప్ర‌భుత్వం..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రవాణా శాఖ కార్యాలయ పక్షాళ‌నపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కోట్లల్లో అక్రమస్తులు కూడ‌పెట్టినట్లు గుర్తించి ఆయ‌న్ను అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే ఇవాళ వ‌రంగ‌ల్ డీటీవోగా పని చేస్తున్న లక్ష్మీపై వేటు ప‌డింది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఆమెను రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వ‌హించ‌డంతోపాటు అవినీతి ఆరోపణల నేప‌థ్యంలో డీటీవోపై వేటు వేసినట్లు తెలుస్తోంది. గతంలో డీటీవో లక్ష్మికి వరంగల్ కలెక్టర్ నుంచి షోకాస్ నోటీసులు సైతం అందాయి. తాజాగా ఆమెను డీటీవోగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీకావడం కలకలం రేపుతోంది. వరంగల్ ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Tags:

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
క్రైమ్ 
Read More...
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. - చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు
క్రైమ్ 
Read More...
లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం రైతులు దళాలను నమ్మొద్దు..   ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి అక్షరదర్బార్, పరకాల:నడికూడ మండల కేంద్రంలో...
Read More...
మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్...
క్రైమ్ 
Read More...
భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

దోషులను వదిలే ప్రసక్తే లేదు

- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? - సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి...
వార్తలు 
Read More...
దోషులను వదిలే ప్రసక్తే లేదు