భూతగాదాలో మరొకరు బలి

భూతగాదాలో మరొకరు బలి

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • వరస ఘటనల కలకలం

భూ తగాదాలో మరో ప్రాణం బలి 

*కాటారం మండలం లో వరుస ఘటనల కలకలం 
*కాటారం లో వ్యక్తి దారుణ హత్య 

అక్షర దర్బార్, కాటారం : భూ తగాదాకు మరో ప్రాణం బలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాటారం మండల కేంద్ర పరిధిలో ఇప్పలగూడెం కు చెందిన డోంగిరి బుచ్చయ్య (55) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబం తో గత కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తుంది.ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగగా మాట మాట పెరిగి కర్రలతో దాడిచేసుకున్నట్లుగా సమాచారం. దీంతో బుచ్చయ్య తలపై పెద్ద దుంగతో బాదగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. కాగా కాటారం మండలంలో ఇటీవల భూ వివాదాలతో వరుసహత్య లు చోటుచేసుకోవడం మండల వ్యాప్తంగా  కలకలం సృష్టిస్తుంది. కొన్ని రోజుల క్రితం కాటారం మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య ను సొంత తమ్ముడి కుటుంబీకులే హత్య చేసిన దారుణ ఘటన విషయం తెలిసిందే.

Tags:

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. పరారీలో నిందితుడు  అక్షరదర్బార్, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో...
Read More...
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

మహిళా ఉద్యోగులకు వేధింపులు

మహిళా ఉద్యోగులకు వేధింపులు  - ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం - ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ...
Read More...
మహిళా ఉద్యోగులకు వేధింపులు

లంచం అడిగితే నా దృష్టికి తేండి

- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం- ఎమ్మెల్యే నాయిని రాజేందర్...
వార్తలు 
Read More...
లంచం అడిగితే నా దృష్టికి తేండి

లంచాలు అడిగితే నా దృష్టికి తేండి

పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి...
వార్తలు 
Read More...
లంచాలు అడిగితే నా దృష్టికి తేండి

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. వార్డు సభ్యుల ఆగ్రహం అక్షర దర్బార్, శాయంపేట: గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ...
Read More...
తీర్మానం లేకుండా నిధుల డ్రా..