భూతగాదాలో మరొకరు బలి

భూతగాదాలో మరొకరు బలి

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • వరస ఘటనల కలకలం

భూ తగాదాలో మరో ప్రాణం బలి 

*కాటారం మండలం లో వరుస ఘటనల కలకలం 
*కాటారం లో వ్యక్తి దారుణ హత్య 

అక్షర దర్బార్, కాటారం : భూ తగాదాకు మరో ప్రాణం బలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాటారం మండల కేంద్ర పరిధిలో ఇప్పలగూడెం కు చెందిన డోంగిరి బుచ్చయ్య (55) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబం తో గత కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తుంది.ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగగా మాట మాట పెరిగి కర్రలతో దాడిచేసుకున్నట్లుగా సమాచారం. దీంతో బుచ్చయ్య తలపై పెద్ద దుంగతో బాదగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. కాగా కాటారం మండలంలో ఇటీవల భూ వివాదాలతో వరుసహత్య లు చోటుచేసుకోవడం మండల వ్యాప్తంగా  కలకలం సృష్టిస్తుంది. కొన్ని రోజుల క్రితం కాటారం మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య ను సొంత తమ్ముడి కుటుంబీకులే హత్య చేసిన దారుణ ఘటన విషయం తెలిసిందే.

Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్