భూతగాదాలో మరొకరు బలి

భూతగాదాలో మరొకరు బలి

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • వరస ఘటనల కలకలం

భూ తగాదాలో మరో ప్రాణం బలి 

*కాటారం మండలం లో వరుస ఘటనల కలకలం 
*కాటారం లో వ్యక్తి దారుణ హత్య 

అక్షర దర్బార్, కాటారం : భూ తగాదాకు మరో ప్రాణం బలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాటారం మండల కేంద్ర పరిధిలో ఇప్పలగూడెం కు చెందిన డోంగిరి బుచ్చయ్య (55) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబం తో గత కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తుంది.ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగగా మాట మాట పెరిగి కర్రలతో దాడిచేసుకున్నట్లుగా సమాచారం. దీంతో బుచ్చయ్య తలపై పెద్ద దుంగతో బాదగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. కాగా కాటారం మండలంలో ఇటీవల భూ వివాదాలతో వరుసహత్య లు చోటుచేసుకోవడం మండల వ్యాప్తంగా  కలకలం సృష్టిస్తుంది. కొన్ని రోజుల క్రితం కాటారం మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య ను సొంత తమ్ముడి కుటుంబీకులే హత్య చేసిన దారుణ ఘటన విషయం తెలిసిందే.

Tags:

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. అక్షర దర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు....
Read More...
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు వడ్డేపల్లి సబ్...
క్రైమ్ 
Read More...
ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

ఏసీబీ అధికారుల సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన 
వార్తలు 
Read More...
ఏసీబీ అధికారుల సోదాలు

బర్త్ డే వేడుకల్లో విషాదం

స్విమ్మింగ్ పూల్ లో  పడి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి హనుమకొండ జిల్లాలో ఘటన 
క్రైమ్ 
Read More...
బర్త్ డే వేడుకల్లో విషాదం

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.... ఐదుగురు అదుపులోకి…  నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట...
Read More...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.