సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

 

  • పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్ 
  • రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు 
  • విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

అక్షరదర్బార్, తొర్రూరు:
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు జరిపారు. తొర్రూరు సీఐ కే జగదీష్ ను అరెస్టు చేశారు. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడి నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి రూ.2లక్షలు తీసుకున్నారని, నిందితుడిని అరెస్టు చేయటం లేదనే ఆరోపణలు సీఐపై వచ్చాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సిఐ జగదీష్ ను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం వ్యవహారంలో ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్  చేయడం సంచలనం కలిగించింది.

Tags:

సీఐ, ఎస్సై సస్పెన్షన్

- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ - విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం
క్రైమ్ 
Read More...
సీఐ, ఎస్సై సస్పెన్షన్

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

ఆయన స్వస్థలం మరిపెడ అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 
వార్తలు 
Read More...
 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్ - రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం   
క్రైమ్ 
Read More...
కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం 
క్రైమ్ 
Read More...
లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు - రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు  మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ అక్షరదర్బార్, పరకాల :పరకాల ఎమ్మెల్యే...
Read More...
ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు