సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

 

  • పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్ 
  • రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు 
  • విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

అక్షరదర్బార్, తొర్రూరు:
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు జరిపారు. తొర్రూరు సీఐ కే జగదీష్ ను అరెస్టు చేశారు. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడి నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి రూ.2లక్షలు తీసుకున్నారని, నిందితుడిని అరెస్టు చేయటం లేదనే ఆరోపణలు సీఐపై వచ్చాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సిఐ జగదీష్ ను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం వ్యవహారంలో ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్  చేయడం సంచలనం కలిగించింది.

Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు