సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

 

  • పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్ 
  • రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు 
  • విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

అక్షరదర్బార్, తొర్రూరు:
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు జరిపారు. తొర్రూరు సీఐ కే జగదీష్ ను అరెస్టు చేశారు. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడి నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి రూ.2లక్షలు తీసుకున్నారని, నిందితుడిని అరెస్టు చేయటం లేదనే ఆరోపణలు సీఐపై వచ్చాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సిఐ జగదీష్ ను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం వ్యవహారంలో ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్  చేయడం సంచలనం కలిగించింది.

Tags:

గ్రామాల్లో దొంగల హల్చల్

పల్సర్ బైక్, నగదు అపహరణ కరెంట్ వైర్లూ చోరీ.. కేసుల నమోదు 
క్రైమ్ 
Read More...
గ్రామాల్లో దొంగల హల్చల్

మూడు గ్రామాల్లో దొంగల హల్చల్

పల్సర్ బైక్, నగదు అపహరణ కరెంట్ వైర్లూ చోరీ.. కేసు నమోదు  మొగుళ్లపల్లి మండలంలో ప్రజల ఆందోళన
క్రైమ్ 
Read More...
మూడు గ్రామాల్లో దొంగల హల్చల్

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ అక్షర దర్బార్,పరకాల : మండుటెండలో జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ తోడ్పాటు...
Read More...
చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ