డోంట్​ కేర్​.​.!

దర్జాగా ఓవర్​ లోడ్​తో వెళ్తున్న బొగ్గు లారీలు
డోంట్​ కేర్​.​.!

* తగ్గేదేలే అంటున్న ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్ట్​ అసోసియేషన్

* ఓవర్​ లోడ్​ తో రూ.లక్షల్లో సంపాదన ఇక్కడందరికీ షరా మామూళ్లే ​ 

* ప్రశ్నించే వ్యవస్థనే ఏలుతున్న ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్టు అసోసియేషన్​ 

* ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం 

అక్షర దర్బార్​, కాటారం

తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి ఏండ్ల తరబడిగా బొగ్గు లారీలు ఓవర్​ లోడ్​తో వెళ్తున్నా అధికారుల కండ్లకు కనబడట్లేదు. ఓవర్​ లోడ్​, ఓవర్​ స్పీడ్​ తో బొగ్గు లారీలు భీభత్సం సృష్టిస్తున్నప్పటికీ ఏఎమ్మార్​ కంపెనీ,ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్ల పలుకుబడి ముందు అదంతా దిగ దుడుపే అవుతుంది. దీంతో జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలం తాడిచర్ల గ్రామం నుండి భూపాలపల్లి వరకు గల ప్రధాన రహదారి వెంట ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు బాధపడితే మాకేంటి అనుకుంటున్నారో ఏమో గాని ప్రశ్నాంచాల్సిన వ్యవస్థ ఏఎమ్మార్​ కంపెనీ, ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్ల  ముందు మోకరిల్లుతూ జీహుజూర్​ అంటోంది. దీంతో ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్టు కంట్రాక్టర్లు అడ్డగోలు అఘాయిత్యాలకు పాల్పడుతుండగా ప్రశ్నించే వ్యవస్థ స్వాగతం పలుతుకుండం గమనార్హం. బొగ్గు లారీల దాష్టీకానికి ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికార యంత్రాంగం మూగబోతున్న తీరు కలవరానికి గురిచేస్తుంది. ఇదేంటని ఎవరైనా అమాయకులు ప్రశ్నిస్తే వారిపై అన్యాయమైన కేసులు బనాయిస్తూ జైలుకు పంపిస్తున్నట్లు సమాచారం. గతంలో మావోయిస్టులకు కంచుకోట గా ఉన్న ఇలాఖాలోనే పారిశ్రామిక పెత్తందార్లు సృష్టిస్తున్న ఆగడాలను అరికట్టేవారే లేకపోవడంతో జనాలు మూగరోధనకు గురవుతున్నారు...

ఓవర్​ లోడ్​ తో లక్షల్లో సంపాదన

తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి బొగ్గుని తీసి జెన్కో కు తరలించడానికి ఏఎమ్మార్​ అనే సంస్థ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఆ బొగ్గును వెలికితీసీ లారీల ద్వారా తరలించేందుకు గానూ ట్రాన్స్​ పోర్ట్​ అసోసియేషన్​ ల కాంట్రాక్టర్లతో ఏఎమ్మార్​ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో బొగ్గుకి టన్నుకు రూ.265 చొప్పున ఏఎమ్మార్​ కంపెనీ చెల్లిస్తుండగా పాసింగ్ ప్రకారం 14 టైర్ల లారీకి 32,16 టైర్ల లారీకి 35 టన్నుల బొగ్గు పోవాల్సింది ఉంటుంది. ఇలా వెళితే మనకేం లాభముంటుందని అసోసియేషన్​  కాంట్రాక్టర్లు ఏకంగా ఓవర్​ లోడ్ దందాను ఎంచుకున్నారు. ఇలా ఒక్కో లారీలో 10 టన్నులు అదనంగా వేసుకుని వెళుతుండగా​ మాజీ ఎమ్మెల్యే కు బంధువైన ఓ కాంట్రాక్టర్​ కు ఏకంగా 30 లారీలు ఉండడంతో రోజుకి రెండు ట్రిప్పులకు కలిపి రూ.1.50 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓపెన్​ కాస్ట్​ నుండి ఓ ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్​ వి 30 లారీలు,మరో కాంట్రాక్టర్​ వి 20 లారీలు, ఇతరత్రా అన్నీ కలుపుకుని కాంట్రాక్టర్లకు సంబంధించి సుమారు 150 లారీలు నడస్తుండగా రోజుకు లక్షల్లో సంపాదిస్తూ జేబులు నింపుకుంటున్న తీరు ఔరా అనిపిస్తుంది.ఈ కాంట్రాక్టర్లంతా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అసోసియేషన్​ కాంట్రాక్టర్లు కావడం వారికి ధన, రాజకీయ బలం అండదండలు మెండుగా ఉండడంతో అడ్డొచ్చే ఏ వ్యవస్థను ఈజీగా మెయింటేన్​ చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అడ్డగోలుగా ఓవర్​ లోడ్​ వెళుతుండగా పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తు నుండి తేరుకోలేకపోతున్నారు.

ఇక్కడందరకీ షరా మామూళ్లే 
  
ఏఎమ్మార్​,ట్రాన్స్​ పోర్టు  అసోసియేషన్​ కాంట్రాక్టర్లు సంయుక్తంగా ఏర్పడి బహిరంగంగా నెలనెలా  మూమూళ్లు సమర్పించుకుంటూ తమ బిజినెస్​ ని కొనసాగిస్తున్నారు. మల్హర్​,కాటారం, భూపాలపల్లి దారి పొడవు మండలాల సంబంధిత అధికారులకు నెలచొప్పునా ముడుపులు చెల్లిస్తూ పోషిస్తున్నట్లు సమాచారం. ఎంతటి నిజాయితీ కల్గిన అధికారైనా సరే వారికి ఓ రేట్​ కడుతూ తమ దారిలోకి తెచ్చకుంటూ దందాను సాగిస్తుండడం విశేషం. అయితే ఇటీవల తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి ఓవర్​ లోడ్​తో లారీలు వెళుతున్నాయని కలెక్టర్​ రాహుల్​ శర్మ దృష్టికి చేరగా స్పందించిన కలెక్టర్​ లోడింగ్​ పాయింట్​ వద్దకు చేరుకుని ఓవర్​ లోడ్​ ను సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. వారం రోజులపాటు పాసింగ్​ తోనే లారీలు నడుపుతున్నట్లు మాయచేసిన అసోసియేషన్​ కాంట్రాక్టర్లు ఆ తర్వాత రోజునే ఓవర్​ లోడ్​ దందాను తిరిగి పునప్రారంభించడం గమనార్హం.ఇలా కలెక్టర్​ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆయన కళ్లు గప్పి నిత్యం వందలాది బొగ్గు లారీలను జెన్కో కు తరలిస్తుండగా పట్టించుకునే మిగతా జిల్లా అధికారులు మిన్నకుండిపోతున్న తీరు పై ఇక్కడ అందరికీ షరా మామూళ్లేనంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

వామ్మో బొగ్గు లారీలంటూ జనం భయం 
 
తాడిచర్ల, కొయ్యూరు, గంగారం ఎక్స్ రోడ్డు, కాటారం, కొత్తపల్లి, బస్వాపూర్,భూపాలపల్లి గ్రామాల ప్రజలు బొగ్గు లారీలు వాటి నుండి పడే బొగ్గు పెళ్లలు,వచ్చే బొగ్గు డస్ట్​ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు డస్ట్​ వల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్న దాఖలాలున్నాయి. అంతేకాకుండా బొగ్గు లారీల వల్ల పలువురి అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తుండగా వణ్యప్రాణులు సైతం మరణిస్తున్నాయి.బొగ్గు లారీల డ్రైవర్లు హై స్పీడ్​ తో నడుపుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రేయిపగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా డ్రైవింగ్​ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటున్నారు. బొగ్గు లారీలు నడిపే డ్రైవర్లకు లైసెన్స్​ లు ఉండట్లేదని లిక్కర్​ మత్తులో తూగుతూ లారీలు నడుపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వీరి దాష్టీకాని ఎంతో మంది విలువైన ప్రాణా ఓవర్​ లోడ్​ కారణంగా బొగ్గుపై పరదాలు సరిగ్గా కప్పకపోవడంతో లారీల నుండి బొగ్గు పెళ్లు కిందపడుతుండగా వాహనాదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బొగ్గు లారీల నుండి పడే పెళ్లలు, వచ్చే బొగ్గు డస్ట్​ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు డస్ట్​ వల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు.

Tags:

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు