ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర..

ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర..

ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర.. 
 
*గత పాలకులు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు*
 
*గత పాలకులు శాయంపేటలో అంబులెన్స్ ఇవ్వలేని పరిస్థితి*
 
-ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
 
అక్షర దర్బార్ శాయంపేట 
 
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శాయంపేట అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాని కష్టమే నా వృత్తి నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం మట్టిలో కలిసేదాకా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పేదవాళ్లే నా వృత్తిగా పనిచేస్తా అని అన్నారు. గత పాలకులు మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పుచేసి ఎవరికి ఒరగబెట్టారంటే దళిత గిరిజన కుటుంబాలకు మూడెకరాలు ఇస్తానని ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ యువతులు చనిపోయిన కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రి పరామర్శించలేదు అని అన్నారు. కడుపు కట్టుకొని నిజాయితీగా 6 గ్యారంటీలో ఐదు అమలు చేశాం ఇంకొకటి అతి త్వరలో అమలు చేయబోతున్నాం అని అన్నారు. ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. పోయినోడు అప్పులు చేసిపోతే  7 లక్షల కోట్లకు నెలకు మిత్తి 6,500 కోట్లు మిత్తి కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు ఇచ్చిన మాట కట్టుబడి నిజాయితీగా కడుపు కట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అందరం నిజాయితీగా పని చేస్తున్నామని అన్నారు. గతంలో శాయంపేట లో గోడకూలి అంబులెన్స్ ఫోన్ చేస్తే చనిపోయిన తర్వాత అంబులెన్స్ వచ్చిందని అంబులెన్స్ ఉంటే పేదవాడి ప్రాణం కాపాడేది అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీగా శాయంపేట మండలం కి అంబులెన్స్ ని ఇవ్వడం జరిగిందన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని అన్నారు.
 
*మాజీ ఎమ్మెల్యే పై విరుచుకుపడిన  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*
 
భూపాల్ పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గాంధీనగర్ గుట్టను లీజుకు తీసుకుంటే ఆ లీజును క్యాన్సిల్ చేసి దళిత గిరిజన బిడ్డలకు 146 కోట్లతో హాస్టల్ భవనం కడుతున్నామన్నారు. గతంలో పెద్ద పదవి వచ్చి లబ్బర్ సింగ్....అబ్బర్  సింగ్ లెక్క బుయ్యి... బూయ్యిమని.. కార్లు వేసుకొని విప్ లుగా  తిరిగారు. శాయంపేటలో అంబులెన్స్ ఇవ్వలేని వ్యక్తులు ఏం ఒరగబెట్టారు అని అడుగుతున్నా అన్నారు.IMG-20241208-WA1287
Tags:

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాలలో ఒక్కసారిగా మంటలు

పరకాలలో ఒక్కసారిగా మంటలు సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో...
Read More...
పరకాలలో ఒక్కసారిగా మంటలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను