ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర..

ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర..

ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర.. 
 
*గత పాలకులు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు*
 
*గత పాలకులు శాయంపేటలో అంబులెన్స్ ఇవ్వలేని పరిస్థితి*
 
-ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
 
అక్షర దర్బార్ శాయంపేట 
 
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శాయంపేట అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాని కష్టమే నా వృత్తి నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం మట్టిలో కలిసేదాకా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పేదవాళ్లే నా వృత్తిగా పనిచేస్తా అని అన్నారు. గత పాలకులు మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పుచేసి ఎవరికి ఒరగబెట్టారంటే దళిత గిరిజన కుటుంబాలకు మూడెకరాలు ఇస్తానని ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ యువతులు చనిపోయిన కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రి పరామర్శించలేదు అని అన్నారు. కడుపు కట్టుకొని నిజాయితీగా 6 గ్యారంటీలో ఐదు అమలు చేశాం ఇంకొకటి అతి త్వరలో అమలు చేయబోతున్నాం అని అన్నారు. ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. పోయినోడు అప్పులు చేసిపోతే  7 లక్షల కోట్లకు నెలకు మిత్తి 6,500 కోట్లు మిత్తి కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు ఇచ్చిన మాట కట్టుబడి నిజాయితీగా కడుపు కట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అందరం నిజాయితీగా పని చేస్తున్నామని అన్నారు. గతంలో శాయంపేట లో గోడకూలి అంబులెన్స్ ఫోన్ చేస్తే చనిపోయిన తర్వాత అంబులెన్స్ వచ్చిందని అంబులెన్స్ ఉంటే పేదవాడి ప్రాణం కాపాడేది అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీగా శాయంపేట మండలం కి అంబులెన్స్ ని ఇవ్వడం జరిగిందన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని అన్నారు.
 
*మాజీ ఎమ్మెల్యే పై విరుచుకుపడిన  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*
 
భూపాల్ పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గాంధీనగర్ గుట్టను లీజుకు తీసుకుంటే ఆ లీజును క్యాన్సిల్ చేసి దళిత గిరిజన బిడ్డలకు 146 కోట్లతో హాస్టల్ భవనం కడుతున్నామన్నారు. గతంలో పెద్ద పదవి వచ్చి లబ్బర్ సింగ్....అబ్బర్  సింగ్ లెక్క బుయ్యి... బూయ్యిమని.. కార్లు వేసుకొని విప్ లుగా  తిరిగారు. శాయంపేటలో అంబులెన్స్ ఇవ్వలేని వ్యక్తులు ఏం ఒరగబెట్టారు అని అడుగుతున్నా అన్నారు.IMG-20241208-WA1287
Tags:
నాగారం రైతుల యూరియా... బంధువులకు బహుమతి!

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.    తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.      డాక్టర్   అక్షర...
Read More...
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.    అక్షర దర్బార్, పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను...
Read More...
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బిజెపి మండల అధ్యక్షుడు...
Read More...
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం     శాయంపేట, అక్షర దర్బార్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాయంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి జెండా ఆవిష్కరించారు....
Read More...
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం