గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..
అక్షర దర్బార్, పరకాల.
గాంధీ జయంతి రోజు దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా నాన్ వెజ్, వైన్స్ అమ్మకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ చేయించడంతో అధికారికంగా బందు చేస్తున్న వ్యాపారులు ఆరోజే అధికంగా అమ్ముతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని మటన్, చికెన్ వ్యాపారులు గాంధీ జయంతి రోజు వ్యాపారులు తమ ఇళ్లలో గోర్లను, కోళ్లను కోసి భాజప్త అమ్ముతున్నారు. ఈ విషయం పరకాల మున్సిపల్ అధికారులకు సైతం పలువురు తెలిపిన సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నియంత్రించడం లేదని పలువురు వాపోతున్నారు.
