- ప్రకంపణల తీవ్రత రిక్టర్స్కేల్పై 5.3గా నమోదు
- ఉదయం 7:27 గంటలకు కొన్ని సెంకండ్లపాటు కంపించిన భూమి
- ఇండ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
అక్షరదర్బార్, ములుగు: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూప్రకంపణలు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున 7: 27 గంటలకు 2 నుంచి 5 సెంకడ్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించిందని అధికారులు గుర్తించారు. ప్రకంపణల తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్లు కనుగొన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. 