దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..

అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ..
దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..

  • అన్ని రంగాల్లోనూ వేళ్లూనుకొని ఉంది..
    * తెలంగాణ‌లో కుల గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శం
    * నిజం బ‌య‌ట‌కు రావొద్ద‌నే వాళ్లే అడ్డుకుంటున్నారు
    * ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ..
    * హైద‌రాబాద్‌లో మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలతో స‌మావేశం
  •  
  • అక్ష‌ర‌ద‌ర్బార్, హైద‌రాబాద్‌:  దేశంలో కుల వివ‌క్ష బ‌లంగా ఉంద‌ని, రాజ‌కీయ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌లోనూ పాతుకుపోయింద‌ని ఏఐసీసీ (aicc) అగ్ర‌నేత రాహుల్‌గాంధీ (rahul gandhi) అన్నారు. అగ్ర‌కులాల‌కు ఎప్పుడూ కుల వివ‌క్ష క‌న‌ప‌డ‌ద‌ని, దేశం స‌మ‌గ్రంగా అభివృద్ధి చెందాలంటే కుల వివ‌క్ష రూపుమాపాల‌ని రాహుల్ అన్నారు. తెలంగాణ‌లో రేప‌టి నుంచి ప్రారంభంకానున్న కుల గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శ‌మ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు. కుల గ‌ణ‌న ద్వారా ఎవ‌రికీ న‌ష్టం క‌ల‌గ‌కుండా చూడొచ్చ‌ని, అంద‌రికీ స‌మ‌న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. నిజం బ‌య‌ట‌కు రావొద్ద‌నే వాళ్లే కుల గ‌ణ‌న‌ను అడ్డుకుంటున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు. 
  • కుల గ‌ణ‌న‌పై అభిప్రాయ సేక‌ర‌ణ‌
  •  
  • ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ (hyderabad) చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనకు సంబంధించి మేధావులు, పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాలతో బోయిన్‌ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వ‌హించిన సదస్సుకు హాజ‌ర‌య్యారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న రాహుల్‌.. అంత బిజీ షెడ్యూల్‌లోనూ కులగణన కార్యక్రమానికి సమయం కేటాయించారు. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బోయిన్‌పల్లిలోని గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌కు వెళ్లారు. టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సదస్సులో పాల్గొని నేతలతో చర్చించారు. కులగణనపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు