- వేట కొడవలితో గొంతుకోసిన దుండగుడు
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘటన
అక్షరదర్బార్, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు - ఎండ్లగూడ రహదారిపై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ నాగమణి హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం కాగా.. పదినెలల క్రితం భర్త విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నెల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది తట్టుకోలేని ఆమె సోదరుడు కానిస్టేబుల్ను దారుణంగా హత్యచేశాడు. విధులకు వెళ్తుండగా.. కారుతో ఢీకొట్టి వేట కొడవలితో గొంతుకోశాడు. మృతురాలి స్వస్థలం రాయపోలుగా పోలీసులు గుర్తించారు.