ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వరంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఎంజీఎంలో ఉద్యోగిని కొట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్న కిలాడీ లేడీని మ‌ట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేర‌కు ఏసీపీ నందిరాం నాయ‌క్ అరెస్టుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు.  బిల్ల సుమలత అనే మహిళ  15 సంవత్సరాల నుండి ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్‌లో రెండు ఏళ్లుగా పేషెంట్ కేర్‌గా ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం విధులలో భాగంగా బయోమెట్రిక్ తంబ్ పెడుతుండగా ఆలకుంట రాజమ్మ సదరు ఉద్యోగి బిళ్ళ సుమలతను అడ్డుకొని రెండు లక్షల లంచం ఇవ్వాల‌ని, ఈ జీవో తీసుకొచ్చింది తానేన‌ని, రెండు లక్షల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించింది. తన వెంట తెచ్చుకున్న చైన్‌తో సదరు ఉద్యోగిపై విచక్షణరహితంగా దాడి చేసింది. అంతేగాక ఆమె వ‌ద్ద గల  పదివేల రూపాయలు లాక్కొని మొబైల్ ను ధ్వంసంచేసింది. ఈ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బిళ్ళ సుమలత ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు ఆలకుంట రాజమ్మను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి వెయ్యి రూపాయల న‌గ‌దుతోపాటు చైన్ ను స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్‌కు పంపారు. WhatsApp Image 2024-09-10 at 6.58.26 PM (1)

 

Tags:

దోషులను వదిలే ప్రసక్తే లేదు

- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? - సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి...
వార్తలు 
Read More...
దోషులను వదిలే ప్రసక్తే లేదు

తప్పిన పెను ప్రమాదం...

తప్పిన పెను ప్రమాదం... లారీ తాకి తెగిన సర్వీస్ వైరు... డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని బస్టాండ్ వెనుక కాలనీలో ఆదివారం ప్రమాదం...
Read More...
తప్పిన పెను ప్రమాదం...

4.45 గంటల పర్యటన

- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం - శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు - సాయంత్రం 6.30 గంటలకు...
వార్తలు 
Read More...
4.45 గంటల పర్యటన

ఈత సరదా ప్రాణం తీసింది..

ఈత సరదా ప్రాణం తీసింది..    చలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు      హెచ్చరికలు లెక్కచేయని యువకులు    అక్షరదర్బార్, శాయంపేట: శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు వద్ద...
Read More...
ఈత సరదా ప్రాణం తీసింది..

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్- ముగ్గురు పరారీ 
క్రైమ్ 
Read More...
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు