ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వరంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఎంజీఎంలో ఉద్యోగిని కొట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్న కిలాడీ లేడీని మ‌ట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేర‌కు ఏసీపీ నందిరాం నాయ‌క్ అరెస్టుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు.  బిల్ల సుమలత అనే మహిళ  15 సంవత్సరాల నుండి ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్‌లో రెండు ఏళ్లుగా పేషెంట్ కేర్‌గా ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం విధులలో భాగంగా బయోమెట్రిక్ తంబ్ పెడుతుండగా ఆలకుంట రాజమ్మ సదరు ఉద్యోగి బిళ్ళ సుమలతను అడ్డుకొని రెండు లక్షల లంచం ఇవ్వాల‌ని, ఈ జీవో తీసుకొచ్చింది తానేన‌ని, రెండు లక్షల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించింది. తన వెంట తెచ్చుకున్న చైన్‌తో సదరు ఉద్యోగిపై విచక్షణరహితంగా దాడి చేసింది. అంతేగాక ఆమె వ‌ద్ద గల  పదివేల రూపాయలు లాక్కొని మొబైల్ ను ధ్వంసంచేసింది. ఈ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బిళ్ళ సుమలత ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు ఆలకుంట రాజమ్మను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి వెయ్యి రూపాయల న‌గ‌దుతోపాటు చైన్ ను స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్‌కు పంపారు. WhatsApp Image 2024-09-10 at 6.58.26 PM (1)

 

Tags:

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....