ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వరంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఎంజీఎంలో ఉద్యోగిని కొట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్న కిలాడీ లేడీని మ‌ట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేర‌కు ఏసీపీ నందిరాం నాయ‌క్ అరెస్టుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు.  బిల్ల సుమలత అనే మహిళ  15 సంవత్సరాల నుండి ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్‌లో రెండు ఏళ్లుగా పేషెంట్ కేర్‌గా ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం విధులలో భాగంగా బయోమెట్రిక్ తంబ్ పెడుతుండగా ఆలకుంట రాజమ్మ సదరు ఉద్యోగి బిళ్ళ సుమలతను అడ్డుకొని రెండు లక్షల లంచం ఇవ్వాల‌ని, ఈ జీవో తీసుకొచ్చింది తానేన‌ని, రెండు లక్షల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించింది. తన వెంట తెచ్చుకున్న చైన్‌తో సదరు ఉద్యోగిపై విచక్షణరహితంగా దాడి చేసింది. అంతేగాక ఆమె వ‌ద్ద గల  పదివేల రూపాయలు లాక్కొని మొబైల్ ను ధ్వంసంచేసింది. ఈ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బిళ్ళ సుమలత ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు ఆలకుంట రాజమ్మను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి వెయ్యి రూపాయల న‌గ‌దుతోపాటు చైన్ ను స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్‌కు పంపారు. WhatsApp Image 2024-09-10 at 6.58.26 PM (1)

 

Tags:

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాలలో ఒక్కసారిగా మంటలు

పరకాలలో ఒక్కసారిగా మంటలు సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో...
Read More...
పరకాలలో ఒక్కసారిగా మంటలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం