క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..

క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..

  • వ‌రంగ‌ల్‌లోని కిరాణ‌షాపు య‌జ‌మాని మాయాజాలం
  • ప‌క్కా స‌మాచారంతో టాస్క్‌ఫోర్స్ దాడులు
  • భారీగా కల్తీ, నకిలీ, కాలంచెల్లిన ఐట‌మ్స్ గుర్తింపు
  • సుమారు రూ. 8 లక్షల విలువ గల 196 రకాల ప‌దార్థాలు స్వాధీనం 
  • షాప్ య‌జ‌మానిపై కేసు.. 


అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్‌లోని సంతోష్ కుమార్ కిరణం & జనరల్ స్టోర్స్‌లో వరంగల్ టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. కల్తీ, నాసిరకం, శుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన తినుబండారాల‌ను గుర్తించారు. నగరంతోపాటు జిల్లా నలుమూలలకు సప్లయి చేసేందుకు సిద్ధంచేసిన బేక‌రీ ఐటంల‌ను స్వాధీనం చేసుకొన్నారు. అపరిశుభ్రంగా, నాసిరకంగా ఉన్న, కాలంచెల్లిన సుమారు రూ. 8 లక్షల విలువ గల 196 రకాల బేకరీ ఆహార ఉత్పత్తుల తయారీకి వాడే వివిధ ర‌సాయ‌నాలు, పౌడర్లు, చాక్లెట్ స్టిక్‌లు, కలర్ పేస్ట్ మొదలైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని షాప్ ఓనర్ అంచూరి సంతోష్ కుమార్‌పై కేసు న‌మోదు చేశారు. విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమక్షంలో ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించారు.

వ్యాపారస్తులకు సీపీ హెచ్చరిక
 
ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా,కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా వ్యాపారులపై చర్యలు తప్పవ‌ని సీసీ అంబ‌ర్‌కిశోర్ ఝా హెచ్చ‌రించారు.  ప్రముఖ బ్రాండ్‌లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచామ‌న్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే  వ్యాపారులపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. 

ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌

అపరిశుభ్ర, కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది, కాలంచెల్లిన తినుబండారాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు తిని.. చాలామంది అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. బయటి పదార్థాలు కొనే ముందు అందరూ కాలంచెల్లిన తేదీ వివరాలు చూసుకోవాలి. పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల.. విరేచనాలు, వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదర సంబంధ వ్యాధుల బారినపడుతారు అని పోలీస్ క‌మిష‌న‌ర్ అన్నారు. భారీ మొత్తంలో కల్తీ, కాలంచెల్లిన, అపరిశుభ్ర ఉత్ప‌త్తులు పట్టుకోవడంలో ప్రతిభకనపరచిన టాస్క్‌ఫోర్స్ ఏసీసీ మధుసూదన్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రంజిత్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ శరత్, ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకన్న, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, ఇంతేజార్గంజ్ పోలీసులను వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

 

 

 

 

Tags:

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యాక్సిడెంట్ లో ఒకరి మృతి

- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి. - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు
క్రైమ్ 
Read More...
యాక్సిడెంట్ లో ఒకరి మృతి