క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..

క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..

  • వ‌రంగ‌ల్‌లోని కిరాణ‌షాపు య‌జ‌మాని మాయాజాలం
  • ప‌క్కా స‌మాచారంతో టాస్క్‌ఫోర్స్ దాడులు
  • భారీగా కల్తీ, నకిలీ, కాలంచెల్లిన ఐట‌మ్స్ గుర్తింపు
  • సుమారు రూ. 8 లక్షల విలువ గల 196 రకాల ప‌దార్థాలు స్వాధీనం 
  • షాప్ య‌జ‌మానిపై కేసు.. 


అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్‌లోని సంతోష్ కుమార్ కిరణం & జనరల్ స్టోర్స్‌లో వరంగల్ టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. కల్తీ, నాసిరకం, శుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన తినుబండారాల‌ను గుర్తించారు. నగరంతోపాటు జిల్లా నలుమూలలకు సప్లయి చేసేందుకు సిద్ధంచేసిన బేక‌రీ ఐటంల‌ను స్వాధీనం చేసుకొన్నారు. అపరిశుభ్రంగా, నాసిరకంగా ఉన్న, కాలంచెల్లిన సుమారు రూ. 8 లక్షల విలువ గల 196 రకాల బేకరీ ఆహార ఉత్పత్తుల తయారీకి వాడే వివిధ ర‌సాయ‌నాలు, పౌడర్లు, చాక్లెట్ స్టిక్‌లు, కలర్ పేస్ట్ మొదలైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని షాప్ ఓనర్ అంచూరి సంతోష్ కుమార్‌పై కేసు న‌మోదు చేశారు. విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమక్షంలో ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించారు.

వ్యాపారస్తులకు సీపీ హెచ్చరిక
 
ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా,కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా వ్యాపారులపై చర్యలు తప్పవ‌ని సీసీ అంబ‌ర్‌కిశోర్ ఝా హెచ్చ‌రించారు.  ప్రముఖ బ్రాండ్‌లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచామ‌న్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే  వ్యాపారులపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. 

ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌

అపరిశుభ్ర, కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది, కాలంచెల్లిన తినుబండారాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు తిని.. చాలామంది అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. బయటి పదార్థాలు కొనే ముందు అందరూ కాలంచెల్లిన తేదీ వివరాలు చూసుకోవాలి. పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల.. విరేచనాలు, వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదర సంబంధ వ్యాధుల బారినపడుతారు అని పోలీస్ క‌మిష‌న‌ర్ అన్నారు. భారీ మొత్తంలో కల్తీ, కాలంచెల్లిన, అపరిశుభ్ర ఉత్ప‌త్తులు పట్టుకోవడంలో ప్రతిభకనపరచిన టాస్క్‌ఫోర్స్ ఏసీసీ మధుసూదన్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రంజిత్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ శరత్, ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకన్న, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, ఇంతేజార్గంజ్ పోలీసులను వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

 

 

 

 

Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర