గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

  • లంచం ఇవ్వ‌లేద‌ని పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క‌బాదిన వైనం
  • పోలీస్ వాహ‌నంలోనే ద‌వాఖాన‌కు త‌ర‌లించిన సిబ్బంది
  • హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు

 అక్షర దర్బార్, తొర్రూరు : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన శనివారంరాత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం...పెద్దవంగర మండలం శంకర్ తండాకు చెందిన అనూషకు కేసముద్రం మండలం చప్పుడిగుట్ట తండాకు చెందిన బానోత్ రాజేష్‌తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషుల తీర్మానంతో రాజేష్ ఆస్తిని భార్యకు రాసిచ్చాడు. అయినా అనూష కేసుపెట్టింది. కేసులో రాజేష్‌ను ఎస్సై క్రాంతికుమార్ రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా, రూ.15,000 ఇచ్చాడు. మరో 20 వేలు ఇవ్వాలని ఎస్సై ఒత్తిడి చేయగా, డబ్బులు లేవని రాజేష్ చెప్పడంతో కోపంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఎస్సై , సిబ్బంది చితకబాదారు. గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ వాహనంలో తీసుకొని తొర్రూరులోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో చేర్పించి వెళ్ళిపోయారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడు.

Tags:

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య

ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం  మొదట ప్రమాణం చేసిన మౌనిక    ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార...
Read More...
ప్రమాణ స్వీకారం 

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు  22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3 మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న...
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ వశమైన పరకాల

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 
Read More...
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి