గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

  • లంచం ఇవ్వ‌లేద‌ని పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క‌బాదిన వైనం
  • పోలీస్ వాహ‌నంలోనే ద‌వాఖాన‌కు త‌ర‌లించిన సిబ్బంది
  • హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు

 అక్షర దర్బార్, తొర్రూరు : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన శనివారంరాత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం...పెద్దవంగర మండలం శంకర్ తండాకు చెందిన అనూషకు కేసముద్రం మండలం చప్పుడిగుట్ట తండాకు చెందిన బానోత్ రాజేష్‌తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషుల తీర్మానంతో రాజేష్ ఆస్తిని భార్యకు రాసిచ్చాడు. అయినా అనూష కేసుపెట్టింది. కేసులో రాజేష్‌ను ఎస్సై క్రాంతికుమార్ రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా, రూ.15,000 ఇచ్చాడు. మరో 20 వేలు ఇవ్వాలని ఎస్సై ఒత్తిడి చేయగా, డబ్బులు లేవని రాజేష్ చెప్పడంతో కోపంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఎస్సై , సిబ్బంది చితకబాదారు. గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ వాహనంలో తీసుకొని తొర్రూరులోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో చేర్పించి వెళ్ళిపోయారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడు.

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి