గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

  • లంచం ఇవ్వ‌లేద‌ని పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క‌బాదిన వైనం
  • పోలీస్ వాహ‌నంలోనే ద‌వాఖాన‌కు త‌ర‌లించిన సిబ్బంది
  • హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు

 అక్షర దర్బార్, తొర్రూరు : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన శనివారంరాత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం...పెద్దవంగర మండలం శంకర్ తండాకు చెందిన అనూషకు కేసముద్రం మండలం చప్పుడిగుట్ట తండాకు చెందిన బానోత్ రాజేష్‌తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషుల తీర్మానంతో రాజేష్ ఆస్తిని భార్యకు రాసిచ్చాడు. అయినా అనూష కేసుపెట్టింది. కేసులో రాజేష్‌ను ఎస్సై క్రాంతికుమార్ రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా, రూ.15,000 ఇచ్చాడు. మరో 20 వేలు ఇవ్వాలని ఎస్సై ఒత్తిడి చేయగా, డబ్బులు లేవని రాజేష్ చెప్పడంతో కోపంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఎస్సై , సిబ్బంది చితకబాదారు. గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ వాహనంలో తీసుకొని తొర్రూరులోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో చేర్పించి వెళ్ళిపోయారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడు.

Tags:

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. వార్డు సభ్యుల ఆగ్రహం అక్షర దర్బార్, శాయంపేట: గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ...
Read More...
తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

సీఐ, ఎస్సై సస్పెన్షన్

- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ - విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం
క్రైమ్ 
Read More...
సీఐ, ఎస్సై సస్పెన్షన్

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

ఆయన స్వస్థలం మరిపెడ అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 
వార్తలు 
Read More...
 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్ - రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం   
క్రైమ్ 
Read More...
కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం 
క్రైమ్ 
Read More...
లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి