గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

  • లంచం ఇవ్వ‌లేద‌ని పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క‌బాదిన వైనం
  • పోలీస్ వాహ‌నంలోనే ద‌వాఖాన‌కు త‌ర‌లించిన సిబ్బంది
  • హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు

 అక్షర దర్బార్, తొర్రూరు : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన శనివారంరాత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం...పెద్దవంగర మండలం శంకర్ తండాకు చెందిన అనూషకు కేసముద్రం మండలం చప్పుడిగుట్ట తండాకు చెందిన బానోత్ రాజేష్‌తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషుల తీర్మానంతో రాజేష్ ఆస్తిని భార్యకు రాసిచ్చాడు. అయినా అనూష కేసుపెట్టింది. కేసులో రాజేష్‌ను ఎస్సై క్రాంతికుమార్ రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా, రూ.15,000 ఇచ్చాడు. మరో 20 వేలు ఇవ్వాలని ఎస్సై ఒత్తిడి చేయగా, డబ్బులు లేవని రాజేష్ చెప్పడంతో కోపంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఎస్సై , సిబ్బంది చితకబాదారు. గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ వాహనంలో తీసుకొని తొర్రూరులోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో చేర్పించి వెళ్ళిపోయారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడు.

Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర