భూకంపం@5.3

భూకంపం@5.3

  • కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి
  • ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం 
  • ఏమి జరిగిందని ఆందోళన
  • రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు 

భూకంపం 

- రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు

అక్షరదర్బార్, హనుమకొండ:

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం భూమి కంపించింది.. ఆందోళనతో ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం ఏమి జరిగిందని చర్చించుకుంటున్నారు.

7:28గంటలకి 10 సెకన్ల పాటు కంపించిన భూమితో ప్రజలు ఆందోళన చెందారు. స్వల్ప కాలమే భూమి కంపించి నట్లు కనిపించినా గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇలాంటి అనుభవం ఎదురుకాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మంచంపై నిద్రించిన వారికి, కూర్చున్న వారికి కొద్ది సెకన్ల పాటు అటూ ఇటూ ఊపినట్లి అనుభూతి చెందారు. దీంతో బయటికి వచ్చి చర్చించుకోవడం కనిపించింది.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో వస్తువులు కూడా భూమి కంపించిన సమయంలో కింద పడ్డాయి.

 

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు*

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం ఈరోజు ఉదయం 7:28 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు అయినట్లు తెలిసింది. ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారని తెలిసింది.

Tags:

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు..  - 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
వార్తలు 
Read More...
నిషేధిత కలుపు మందు స్వాధీనం

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!