భారీ ఎన్ కౌంటర్

భారీ ఎన్ కౌంటర్

  • తెలంగాణ- చత్తీస్గడ్ సరిహద్దులో కాల్పులు
  • ఎనిమిది మంది మావోయిస్టులు మృతి 
  • చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఘటన

భారీ ఎన్ కౌంటర్ 

- ఏడుగురు మావోయిస్టుల మృతి 

 

అక్షరదర్బార్, ఏటూరునాగారం: తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్ జీఏ) ఆవిర్భవించి 24 సంవత్సరాలు అవుతున్న తరుణంలో డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి పీఎల్ జీఏ వార్షికోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందే చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పీఎల్ జీఏ వార్షికోత్సవాల దృష్ట్యా పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ మరింత విస్తృతం చేసిన క్రమంలో చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించగా కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం మృతుల వివరాలు...

మావోయిస్టు దళ కమండర్ తో పాటు ఏడుగురు నక్సల్స్ మృతి.

 భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

మృతి చెందిన మావోయిస్టులు...

కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, TSCM, సెక్రటరీ ఇల్లందు - నర్సంపేట AC, AK-

 47 రైఫిల్.

ఈగోలపు మల్లయ్య @ మధు, DVCM, 

కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్

ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM, 

ముస్సాకి జమున,

ACM, జైసింగ్, పార్టీ సభ్యుడు

 కిషోర్, పార్టీ సభ్యుడు

 కామేష్, పార్టీ సభ్యుడుIMG-20241201-WA0005 IMG-20241201-WA0007

Tags:

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్