భారీ ఎన్ కౌంటర్

భారీ ఎన్ కౌంటర్

  • తెలంగాణ- చత్తీస్గడ్ సరిహద్దులో కాల్పులు
  • ఎనిమిది మంది మావోయిస్టులు మృతి 
  • చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఘటన

భారీ ఎన్ కౌంటర్ 

- ఏడుగురు మావోయిస్టుల మృతి 

 

అక్షరదర్బార్, ఏటూరునాగారం: తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్ జీఏ) ఆవిర్భవించి 24 సంవత్సరాలు అవుతున్న తరుణంలో డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి పీఎల్ జీఏ వార్షికోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందే చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పీఎల్ జీఏ వార్షికోత్సవాల దృష్ట్యా పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ మరింత విస్తృతం చేసిన క్రమంలో చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించగా కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం మృతుల వివరాలు...

మావోయిస్టు దళ కమండర్ తో పాటు ఏడుగురు నక్సల్స్ మృతి.

 భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

మృతి చెందిన మావోయిస్టులు...

కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, TSCM, సెక్రటరీ ఇల్లందు - నర్సంపేట AC, AK-

 47 రైఫిల్.

ఈగోలపు మల్లయ్య @ మధు, DVCM, 

కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్

ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM, 

ముస్సాకి జమున,

ACM, జైసింగ్, పార్టీ సభ్యుడు

 కిషోర్, పార్టీ సభ్యుడు

 కామేష్, పార్టీ సభ్యుడుIMG-20241201-WA0005 IMG-20241201-WA0007

Tags:

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....