ఏసీబీ వలలో పీఆర్ ఏఈ

ఏసీబీ వలలో పీఆర్ ఏఈ

  • రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్
  • బిల్లు ఫైలు క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ 
  • వల పన్ని ఏఈని పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఏసీబీ వలలో పీఆర్ ఏఈ 
- రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్

అక్షరదర్బార్, వరంగల్: అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రభుత్వ శాఖల్లో లంచవతారాలను వలపన్ని పట్టుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఇంజనీరు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో  పంచాయతీరాజ్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఏఈ కార్తీక్ రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టు బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ వద్ద సతీష్ నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏఈ కార్తీక్ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కాడు. అనంతరం హనుమకొండలోని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

Tags:

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

ఆయన స్వస్థలం మరిపెడ అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 
వార్తలు 
Read More...
 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్ - రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం   
క్రైమ్ 
Read More...
కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం 
క్రైమ్ 
Read More...
లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు - రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు  మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ అక్షరదర్బార్, పరకాల :పరకాల ఎమ్మెల్యే...
Read More...
ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు..  - 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
వార్తలు 
Read More...
నిషేధిత కలుపు మందు స్వాధీనం