ఎస్సై హరీష్ సూసైడ్

ఎస్సై హరీష్ సూసైడ్

  • గన్ తో  కాల్చుకుని ఆత్మహత్య
  • ములుగు జిల్లాలో విషాదం 
  • చర్చనీయమైన ఎస్సై ఆత్మహత్య

 

గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య 

 

అక్షరదర్బార్, వాజేడు:

ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాజేడు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ముళ్లకట్ట వద్ద ఉన్న ఓ రిసార్ట్స్ గదిలో ఆయన తన రివాల్వర్ తో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. హరీష్ గతంలో పేరూరు ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీపై వాజేడుకు వచ్చినట్లుగా సమాచారం. ఎస్సై మృతి పోలీసు వర్గాల్లో చర్చనీయమైంది. ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వ్యక్తిగత కారణాలా, పని ఒత్తిడినా, అధికారుల చర్యలా అనే చర్చ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ హరీష్ ఆత్మహత్యతో పోలీస్ వర్గాల్లో విషాదం  చోటు చేసుకుంది. 2020 బ్యాచ్ కు చెందిన హరీష్ మొదట వాజేడులో ప్రొబేషనరీ ఎస్సైగా, ఆ తర్వాత పేరూరు ఎస్సైగా విధులు నిర్వహించి తిరిగి వాజేడు ఎస్సైగా ఆరు నెలల క్రితం వచ్చినట్లు తెలిసింది.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక- ఐలాపూర్ అడవుల్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఇదే ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం వాజేడులో పోలీస్ ఇన్ఫార్మర్లుగా పేర్కొంటూ మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసిన విషయం కూడా విధితమే. ఈ క్రమంలో వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ స్వగ్పారామం భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లె. హరీష్ కు ఇటీవల పెళ్లి నిశ్చయం జరిగినట్లు తెలిసింది.

IMG-20241202-WA0007

IMG-20241202-WA0006

Tags:

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యాక్సిడెంట్ లో ఒకరి మృతి

- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి. - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు
క్రైమ్ 
Read More...
యాక్సిడెంట్ లో ఒకరి మృతి