ఎస్సై హరీష్ సూసైడ్

ఎస్సై హరీష్ సూసైడ్

  • గన్ తో  కాల్చుకుని ఆత్మహత్య
  • ములుగు జిల్లాలో విషాదం 
  • చర్చనీయమైన ఎస్సై ఆత్మహత్య

 

గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య 

 

అక్షరదర్బార్, వాజేడు:

ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాజేడు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ముళ్లకట్ట వద్ద ఉన్న ఓ రిసార్ట్స్ గదిలో ఆయన తన రివాల్వర్ తో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. హరీష్ గతంలో పేరూరు ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీపై వాజేడుకు వచ్చినట్లుగా సమాచారం. ఎస్సై మృతి పోలీసు వర్గాల్లో చర్చనీయమైంది. ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వ్యక్తిగత కారణాలా, పని ఒత్తిడినా, అధికారుల చర్యలా అనే చర్చ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ హరీష్ ఆత్మహత్యతో పోలీస్ వర్గాల్లో విషాదం  చోటు చేసుకుంది. 2020 బ్యాచ్ కు చెందిన హరీష్ మొదట వాజేడులో ప్రొబేషనరీ ఎస్సైగా, ఆ తర్వాత పేరూరు ఎస్సైగా విధులు నిర్వహించి తిరిగి వాజేడు ఎస్సైగా ఆరు నెలల క్రితం వచ్చినట్లు తెలిసింది.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక- ఐలాపూర్ అడవుల్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఇదే ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం వాజేడులో పోలీస్ ఇన్ఫార్మర్లుగా పేర్కొంటూ మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసిన విషయం కూడా విధితమే. ఈ క్రమంలో వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ స్వగ్పారామం భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లె. హరీష్ కు ఇటీవల పెళ్లి నిశ్చయం జరిగినట్లు తెలిసింది.

IMG-20241202-WA0007

IMG-20241202-WA0006

Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్