ఎస్సై హరీష్ సూసైడ్

ఎస్సై హరీష్ సూసైడ్

  • గన్ తో  కాల్చుకుని ఆత్మహత్య
  • ములుగు జిల్లాలో విషాదం 
  • చర్చనీయమైన ఎస్సై ఆత్మహత్య

 

గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య 

 

అక్షరదర్బార్, వాజేడు:

ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాజేడు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ముళ్లకట్ట వద్ద ఉన్న ఓ రిసార్ట్స్ గదిలో ఆయన తన రివాల్వర్ తో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. హరీష్ గతంలో పేరూరు ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీపై వాజేడుకు వచ్చినట్లుగా సమాచారం. ఎస్సై మృతి పోలీసు వర్గాల్లో చర్చనీయమైంది. ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వ్యక్తిగత కారణాలా, పని ఒత్తిడినా, అధికారుల చర్యలా అనే చర్చ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ హరీష్ ఆత్మహత్యతో పోలీస్ వర్గాల్లో విషాదం  చోటు చేసుకుంది. 2020 బ్యాచ్ కు చెందిన హరీష్ మొదట వాజేడులో ప్రొబేషనరీ ఎస్సైగా, ఆ తర్వాత పేరూరు ఎస్సైగా విధులు నిర్వహించి తిరిగి వాజేడు ఎస్సైగా ఆరు నెలల క్రితం వచ్చినట్లు తెలిసింది.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక- ఐలాపూర్ అడవుల్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఇదే ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం వాజేడులో పోలీస్ ఇన్ఫార్మర్లుగా పేర్కొంటూ మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసిన విషయం కూడా విధితమే. ఈ క్రమంలో వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ స్వగ్పారామం భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లె. హరీష్ కు ఇటీవల పెళ్లి నిశ్చయం జరిగినట్లు తెలిసింది.

IMG-20241202-WA0007

IMG-20241202-WA0006

Tags:

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బిజెపి మండల అధ్యక్షుడు...
Read More...
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం     శాయంపేట, అక్షర దర్బార్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాయంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి జెండా ఆవిష్కరించారు....
Read More...
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు    అక్షర దర్బార్, శాయంపేట : ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...
Read More...
ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .    - ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"    - రైతులపై కేసులు వద్దు.    - పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.    అక్షరదర్బార్, పరకాల:...
Read More...
రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....   – ప్రజల విజ్ఞప్తి.    అక్షర దర్బార్, పరకాల: నడికూడ మండలంలోని కంటత్మకూర్ వాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వాగు ఉధృతంగా పొంగిపొర్లి...
Read More...
కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....