- అడవిలోకి తీసుకెళ్లి దారుణం
- కాటారం మండలంలో ఘటన..
- పోలీసుల అదుపులో నిందితుడు
అక్షరదర్బార్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అంకుశాపూర్ శివారులో ఓమహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలిసింది. స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాలువ శైలజ (38)కు అంకుశాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో గత ఐదేండ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. గత కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతునట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి మూడు రోజుల క్రితం శైలజను అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. ఈమేరకు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.