మకాం మార్చిన ఇసుక మాఫియా

మకాం మార్చిన ఇసుక మాఫియా

  • అక్రమ సంపాదనకై మహదేవపూర్ కు షిఫ్ట్
  • ఓం ఇసుక ట్రాక్టర్ పట్టివేత 
  • మూడు రోజుల నుంచి జోరుగా రవాణా?

మకాం మార్చిన ఇసుక మాఫియా...!!!

* అక్రమ సంపాదనకై మహదేవపూర్​ కు షిఫ్ట్
​ 
* మహదేవపూర్​ లో ఇసుక ట్రాక్టర్​ పట్టివేత
 
* మూడు రోజులుగా కుదురుపల్లి నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా...?

 * కేసు నుండీ తప్పించాలంటూ అధికారులతో మంతనాలు 

అక్షర దర్బార్​, కాటారంః
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్​ నుండి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ అక్రమార్జనకు తెగపడ్డారు. ఈ విషయమై 'అక్షర దర్బార్'​ పత్రికలో వరుస కథనాలు వెలువడగా స్పందించిన పోలీస్​ యంత్రాంగం విలాసాగర్​ నుండీ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపులుగా ఏర్పాటుచేసుకుని వరంగల్​,హైదరాబాద్​ లాంటి నగరాలకు లారీల్లో తరలిస్తూ సొమ్ముచేసుకున్నారు.ఈ నేపథ్యంలో స్పందించిన కాటారం పోలీసులు అక్రమ ఇసుక రవాణా ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేయగా సదరు ఇసుక స్మగ్లర్లు మకాం మార్చారు.మహదేవపూర్​ మండలం కేంద్రంగా అర్థరాత్రుల్లో ఇసుక తరలింపుకై పన్నాగం పన్ని అక్రమార్గంలో ఇసుకను తరలిస్తుండగా ఆదివారం రెండ్​ హ్యాండెడ్​ గా ఓ ట్రాక్టర్​ పట్టుబడింది.కాగా ఆ ట్రాక్టర్​ కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా తెలుస్తోంది.


సండే కలిసొస్తుందనే పక్కా ప్లాన్ 

 
 ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే పక్కా ప్రణాళికతో కాటారం మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ట్రాక్టర్లను కుదురుపల్లిలోని ఇసుకను  అర్థరాత్రి నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమార్జనకై బానిసైన సదరు వ్యక్తులు కాటారం మండలంలో  ఇసుక రవాణాను బంద్​ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.దీంతో ఏమైనా సరే తగ్గేదెలే అంటూ మహదేవపూర్​ మండలమే తమ అక్రమార్జనకు అనువైన ప్రాంతమని భావించి సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో  ఆదివారం అనువైన సమయమైన మేం ఆఫ్​ డ్యూటి అని చెప్పుకోవచ్చనీ మీ పని మీరు చేసుకోండి మాకేమైనా ఉంటే చూసుకోండంటూ సదరు అక్రమ ఇసుక రవాణా వ్యక్తులకు ముందస్తూ సంకేతాలు కింది స్థాయి ఉద్యోగుల తో సంబంధిత అధికారులు చెప్పించినట్లు తెలుస్తోంది.అయితే విషయం కాస్తా స్థానిక మీడియాకు తెలియడంతో స్వయంగా ఆ రిపోర్టర్లు అధికారులకు సమాచారం అందించగా ఏం చేయలేని స్థితిలో ట్రాక్టర్​ ను పట్టుకున్నట్లుగా తెలుస్తున్నది.కాగా పట్టుబడిన ట్రాక్టర్​ యజమాని తన బంధువులైన రాజకీయ నాయకుల అండదండలతో కేసు నుండీ తప్పించుకునేందుకు మంతనాలు జరిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:

దామెరలో గంజాయి పట్టివేత..

దామెరలో గంజాయి పట్టివేత.. 210 గ్రాములు స్వాధీనం   ఇద్దరు యువకులు అరెస్ట్ అక్షరదర్బార్, పరకాల:దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు...
Read More...
దామెరలో గంజాయి పట్టివేత..

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

  బాబు జగ్జీవన్ రామ్ జయంతి .. పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య అక్షరదర్బార్,...
Read More...
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు   అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత అక్షరదర్బార్,పరకాల: పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా...
Read More...
ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

తహసిల్దార్ల బదిలీ

పదిమంది తహసిల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లకు స్థాన చలనం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
వార్తలు 
Read More...
తహసిల్దార్ల బదిలీ

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. అక్షర దర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు....
Read More...
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..