మకాం మార్చిన ఇసుక మాఫియా

మకాం మార్చిన ఇసుక మాఫియా

  • అక్రమ సంపాదనకై మహదేవపూర్ కు షిఫ్ట్
  • ఓం ఇసుక ట్రాక్టర్ పట్టివేత 
  • మూడు రోజుల నుంచి జోరుగా రవాణా?

మకాం మార్చిన ఇసుక మాఫియా...!!!

* అక్రమ సంపాదనకై మహదేవపూర్​ కు షిఫ్ట్
​ 
* మహదేవపూర్​ లో ఇసుక ట్రాక్టర్​ పట్టివేత
 
* మూడు రోజులుగా కుదురుపల్లి నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా...?

 * కేసు నుండీ తప్పించాలంటూ అధికారులతో మంతనాలు 

అక్షర దర్బార్​, కాటారంః
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్​ నుండి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ అక్రమార్జనకు తెగపడ్డారు. ఈ విషయమై 'అక్షర దర్బార్'​ పత్రికలో వరుస కథనాలు వెలువడగా స్పందించిన పోలీస్​ యంత్రాంగం విలాసాగర్​ నుండీ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపులుగా ఏర్పాటుచేసుకుని వరంగల్​,హైదరాబాద్​ లాంటి నగరాలకు లారీల్లో తరలిస్తూ సొమ్ముచేసుకున్నారు.ఈ నేపథ్యంలో స్పందించిన కాటారం పోలీసులు అక్రమ ఇసుక రవాణా ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేయగా సదరు ఇసుక స్మగ్లర్లు మకాం మార్చారు.మహదేవపూర్​ మండలం కేంద్రంగా అర్థరాత్రుల్లో ఇసుక తరలింపుకై పన్నాగం పన్ని అక్రమార్గంలో ఇసుకను తరలిస్తుండగా ఆదివారం రెండ్​ హ్యాండెడ్​ గా ఓ ట్రాక్టర్​ పట్టుబడింది.కాగా ఆ ట్రాక్టర్​ కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా తెలుస్తోంది.


సండే కలిసొస్తుందనే పక్కా ప్లాన్ 

 
 ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే పక్కా ప్రణాళికతో కాటారం మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ట్రాక్టర్లను కుదురుపల్లిలోని ఇసుకను  అర్థరాత్రి నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమార్జనకై బానిసైన సదరు వ్యక్తులు కాటారం మండలంలో  ఇసుక రవాణాను బంద్​ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.దీంతో ఏమైనా సరే తగ్గేదెలే అంటూ మహదేవపూర్​ మండలమే తమ అక్రమార్జనకు అనువైన ప్రాంతమని భావించి సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో  ఆదివారం అనువైన సమయమైన మేం ఆఫ్​ డ్యూటి అని చెప్పుకోవచ్చనీ మీ పని మీరు చేసుకోండి మాకేమైనా ఉంటే చూసుకోండంటూ సదరు అక్రమ ఇసుక రవాణా వ్యక్తులకు ముందస్తూ సంకేతాలు కింది స్థాయి ఉద్యోగుల తో సంబంధిత అధికారులు చెప్పించినట్లు తెలుస్తోంది.అయితే విషయం కాస్తా స్థానిక మీడియాకు తెలియడంతో స్వయంగా ఆ రిపోర్టర్లు అధికారులకు సమాచారం అందించగా ఏం చేయలేని స్థితిలో ట్రాక్టర్​ ను పట్టుకున్నట్లుగా తెలుస్తున్నది.కాగా పట్టుబడిన ట్రాక్టర్​ యజమాని తన బంధువులైన రాజకీయ నాయకుల అండదండలతో కేసు నుండీ తప్పించుకునేందుకు మంతనాలు జరిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు