మకాం మార్చిన ఇసుక మాఫియా

మకాం మార్చిన ఇసుక మాఫియా

  • అక్రమ సంపాదనకై మహదేవపూర్ కు షిఫ్ట్
  • ఓం ఇసుక ట్రాక్టర్ పట్టివేత 
  • మూడు రోజుల నుంచి జోరుగా రవాణా?

మకాం మార్చిన ఇసుక మాఫియా...!!!

* అక్రమ సంపాదనకై మహదేవపూర్​ కు షిఫ్ట్
​ 
* మహదేవపూర్​ లో ఇసుక ట్రాక్టర్​ పట్టివేత
 
* మూడు రోజులుగా కుదురుపల్లి నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా...?

 * కేసు నుండీ తప్పించాలంటూ అధికారులతో మంతనాలు 

అక్షర దర్బార్​, కాటారంః
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్​ నుండి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ అక్రమార్జనకు తెగపడ్డారు. ఈ విషయమై 'అక్షర దర్బార్'​ పత్రికలో వరుస కథనాలు వెలువడగా స్పందించిన పోలీస్​ యంత్రాంగం విలాసాగర్​ నుండీ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపులుగా ఏర్పాటుచేసుకుని వరంగల్​,హైదరాబాద్​ లాంటి నగరాలకు లారీల్లో తరలిస్తూ సొమ్ముచేసుకున్నారు.ఈ నేపథ్యంలో స్పందించిన కాటారం పోలీసులు అక్రమ ఇసుక రవాణా ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేయగా సదరు ఇసుక స్మగ్లర్లు మకాం మార్చారు.మహదేవపూర్​ మండలం కేంద్రంగా అర్థరాత్రుల్లో ఇసుక తరలింపుకై పన్నాగం పన్ని అక్రమార్గంలో ఇసుకను తరలిస్తుండగా ఆదివారం రెండ్​ హ్యాండెడ్​ గా ఓ ట్రాక్టర్​ పట్టుబడింది.కాగా ఆ ట్రాక్టర్​ కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా తెలుస్తోంది.


సండే కలిసొస్తుందనే పక్కా ప్లాన్ 

 
 ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే పక్కా ప్రణాళికతో కాటారం మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ట్రాక్టర్లను కుదురుపల్లిలోని ఇసుకను  అర్థరాత్రి నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమార్జనకై బానిసైన సదరు వ్యక్తులు కాటారం మండలంలో  ఇసుక రవాణాను బంద్​ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.దీంతో ఏమైనా సరే తగ్గేదెలే అంటూ మహదేవపూర్​ మండలమే తమ అక్రమార్జనకు అనువైన ప్రాంతమని భావించి సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో  ఆదివారం అనువైన సమయమైన మేం ఆఫ్​ డ్యూటి అని చెప్పుకోవచ్చనీ మీ పని మీరు చేసుకోండి మాకేమైనా ఉంటే చూసుకోండంటూ సదరు అక్రమ ఇసుక రవాణా వ్యక్తులకు ముందస్తూ సంకేతాలు కింది స్థాయి ఉద్యోగుల తో సంబంధిత అధికారులు చెప్పించినట్లు తెలుస్తోంది.అయితే విషయం కాస్తా స్థానిక మీడియాకు తెలియడంతో స్వయంగా ఆ రిపోర్టర్లు అధికారులకు సమాచారం అందించగా ఏం చేయలేని స్థితిలో ట్రాక్టర్​ ను పట్టుకున్నట్లుగా తెలుస్తున్నది.కాగా పట్టుబడిన ట్రాక్టర్​ యజమాని తన బంధువులైన రాజకీయ నాయకుల అండదండలతో కేసు నుండీ తప్పించుకునేందుకు మంతనాలు జరిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.  అక్షర దర్బార్, శాయంపేట:శాయంపేటలో...
Read More...
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.