టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌

ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌

తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

* జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష 

* మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం 

* అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి ..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. అందులో భాగంగానే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇక రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈక్రమంలోనే ఈరోజు నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. టెట్ పేప‌ర్‌-1కు డీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాగా... టెట్ పేప‌ర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇక టెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది సార్లు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌గా.. జ‌న‌వ‌రిలో ప‌దోసారి జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Tags: Ts tet

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.  అక్షర దర్బార్, శాయంపేట:శాయంపేటలో...
Read More...
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.