టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌

ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌

తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

* జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష 

* మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం 

* అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి ..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. అందులో భాగంగానే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇక రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈక్రమంలోనే ఈరోజు నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. టెట్ పేప‌ర్‌-1కు డీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాగా... టెట్ పేప‌ర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇక టెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది సార్లు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌గా.. జ‌న‌వ‌రిలో ప‌దోసారి జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Tags: Ts tet

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....