టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌

ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌

తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

* జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష 

* మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం 

* అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి ..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. అందులో భాగంగానే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇక రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈక్రమంలోనే ఈరోజు నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. టెట్ పేప‌ర్‌-1కు డీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాగా... టెట్ పేప‌ర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇక టెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది సార్లు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌గా.. జ‌న‌వ‌రిలో ప‌దోసారి జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Tags: Ts tet

పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది...
రాజకీయం 
Read More...
పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి.. - నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం...
రాజకీయం 
Read More...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

పెద్ది విగ్రహం తొలగింపు

- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
రాజకీయం 
Read More...
పెద్ది విగ్రహం తొలగింపు

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత