ఆగని ఇసుక జీరో దందా!

ఆగని ఇసుక జీరో దందా!

  • కాటారంలో ఓ లారీని పట్టుకున్న పోలీసులు
  • జీరో ఇసుకను వదిలేసి పోయిన ఇసుక స్మగ్లర్లు 
  • చర్చనీయాంశమైన ఇసుక అక్రమ రవాణా 

ఆగని ఇసుక జీరో దందా! 

అక్షర దర్బార్​, కాటారంః
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లో​ నడుస్తున్న ఇసుక రీచుల్లో జీరో దందా ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట ఇసుక లారీలు పట్టుబడ్డట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నప్పటికినీ ఇసుక స్మగ్లర్లు అవేమి పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులకు తామిచ్చే ధనబలమో, లీడర్ల అండ బలమో తెలియదు కాని ఇసుక స్మగ్లర్లు దర్జాగా ఇసుక దందాను సాగిస్తున్న తీరు  సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.ఓ పరంగా ఆయా శాఖల అధికారులు ఇసుక స్మగర్లకు నడుపుకోండని మౌఖిక సంఘీభావం తెలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* పల్గుల క్వారీ నుండి 3 లారీలు..?

మహదేవపూర్​ సమీప గ్రామాలకు చెందిన ఇసుక లారీల యజమానులు పల్గుల క్వారీ నుండి  3 ఇసుక లారీల్లో జీరో ఇసుక నింపుకుని ఎస్కార్ట్ గా బయలుదేరినట్లు సమాచారం .ముందుగా ఓ ఇసుక లారీ కాటారం చెక్​ పోస్టు వద్దకు చేరుకోగా ఎలాంటి వేబిల్లు లేకపోవడంతో పోలీసులు పట్టుకున్నారు.అయితే వెనుకాలే వస్తున్న మరో రెండు లారీలకు పట్టుబడిన లారీ ఓనర్​ కమ్​ డ్రైవర్​ పట్టుబడ్డానని మీరు అటునుండి అటే పారిపోండని సమాచారం ఇచ్చాడు.దీంతో అప్రమత్తమైన సదరు ఇసుక లారీల ఓనర్లు,డ్రైవర్లు వెనక్కి తిప్పుకుని మహదేవపూర్​లోని అయ్యప్ప టెంపుల్​ వద్ద ప్రధాన రహదారి పక్కనే అన్లోడ్​ చేసి పారిపోయారు.ఈ విషయమై సంబంధిత ఓ పోలిస్​ అధికారికి వివరణ అడగ్గా బ్రేక్​ ఫెయులవ్వడంతో ఇసుకను అన్లోడ్​ చేసినట్లు చెప్పడం గమనార్హం.

Tags:

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన