ఆగని ఇసుక జీరో దందా!

ఆగని ఇసుక జీరో దందా!

  • కాటారంలో ఓ లారీని పట్టుకున్న పోలీసులు
  • జీరో ఇసుకను వదిలేసి పోయిన ఇసుక స్మగ్లర్లు 
  • చర్చనీయాంశమైన ఇసుక అక్రమ రవాణా 

ఆగని ఇసుక జీరో దందా! 

అక్షర దర్బార్​, కాటారంః
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లో​ నడుస్తున్న ఇసుక రీచుల్లో జీరో దందా ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట ఇసుక లారీలు పట్టుబడ్డట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నప్పటికినీ ఇసుక స్మగ్లర్లు అవేమి పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులకు తామిచ్చే ధనబలమో, లీడర్ల అండ బలమో తెలియదు కాని ఇసుక స్మగ్లర్లు దర్జాగా ఇసుక దందాను సాగిస్తున్న తీరు  సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.ఓ పరంగా ఆయా శాఖల అధికారులు ఇసుక స్మగర్లకు నడుపుకోండని మౌఖిక సంఘీభావం తెలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* పల్గుల క్వారీ నుండి 3 లారీలు..?

మహదేవపూర్​ సమీప గ్రామాలకు చెందిన ఇసుక లారీల యజమానులు పల్గుల క్వారీ నుండి  3 ఇసుక లారీల్లో జీరో ఇసుక నింపుకుని ఎస్కార్ట్ గా బయలుదేరినట్లు సమాచారం .ముందుగా ఓ ఇసుక లారీ కాటారం చెక్​ పోస్టు వద్దకు చేరుకోగా ఎలాంటి వేబిల్లు లేకపోవడంతో పోలీసులు పట్టుకున్నారు.అయితే వెనుకాలే వస్తున్న మరో రెండు లారీలకు పట్టుబడిన లారీ ఓనర్​ కమ్​ డ్రైవర్​ పట్టుబడ్డానని మీరు అటునుండి అటే పారిపోండని సమాచారం ఇచ్చాడు.దీంతో అప్రమత్తమైన సదరు ఇసుక లారీల ఓనర్లు,డ్రైవర్లు వెనక్కి తిప్పుకుని మహదేవపూర్​లోని అయ్యప్ప టెంపుల్​ వద్ద ప్రధాన రహదారి పక్కనే అన్లోడ్​ చేసి పారిపోయారు.ఈ విషయమై సంబంధిత ఓ పోలిస్​ అధికారికి వివరణ అడగ్గా బ్రేక్​ ఫెయులవ్వడంతో ఇసుకను అన్లోడ్​ చేసినట్లు చెప్పడం గమనార్హం.

Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు