ఆగని ఇసుక జీరో దందా!

ఆగని ఇసుక జీరో దందా!

  • కాటారంలో ఓ లారీని పట్టుకున్న పోలీసులు
  • జీరో ఇసుకను వదిలేసి పోయిన ఇసుక స్మగ్లర్లు 
  • చర్చనీయాంశమైన ఇసుక అక్రమ రవాణా 

ఆగని ఇసుక జీరో దందా! 

అక్షర దర్బార్​, కాటారంః
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లో​ నడుస్తున్న ఇసుక రీచుల్లో జీరో దందా ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట ఇసుక లారీలు పట్టుబడ్డట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నప్పటికినీ ఇసుక స్మగ్లర్లు అవేమి పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులకు తామిచ్చే ధనబలమో, లీడర్ల అండ బలమో తెలియదు కాని ఇసుక స్మగ్లర్లు దర్జాగా ఇసుక దందాను సాగిస్తున్న తీరు  సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.ఓ పరంగా ఆయా శాఖల అధికారులు ఇసుక స్మగర్లకు నడుపుకోండని మౌఖిక సంఘీభావం తెలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* పల్గుల క్వారీ నుండి 3 లారీలు..?

మహదేవపూర్​ సమీప గ్రామాలకు చెందిన ఇసుక లారీల యజమానులు పల్గుల క్వారీ నుండి  3 ఇసుక లారీల్లో జీరో ఇసుక నింపుకుని ఎస్కార్ట్ గా బయలుదేరినట్లు సమాచారం .ముందుగా ఓ ఇసుక లారీ కాటారం చెక్​ పోస్టు వద్దకు చేరుకోగా ఎలాంటి వేబిల్లు లేకపోవడంతో పోలీసులు పట్టుకున్నారు.అయితే వెనుకాలే వస్తున్న మరో రెండు లారీలకు పట్టుబడిన లారీ ఓనర్​ కమ్​ డ్రైవర్​ పట్టుబడ్డానని మీరు అటునుండి అటే పారిపోండని సమాచారం ఇచ్చాడు.దీంతో అప్రమత్తమైన సదరు ఇసుక లారీల ఓనర్లు,డ్రైవర్లు వెనక్కి తిప్పుకుని మహదేవపూర్​లోని అయ్యప్ప టెంపుల్​ వద్ద ప్రధాన రహదారి పక్కనే అన్లోడ్​ చేసి పారిపోయారు.ఈ విషయమై సంబంధిత ఓ పోలిస్​ అధికారికి వివరణ అడగ్గా బ్రేక్​ ఫెయులవ్వడంతో ఇసుకను అన్లోడ్​ చేసినట్లు చెప్పడం గమనార్హం.

Tags:

పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది...
రాజకీయం 
Read More...
పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి.. - నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం...
రాజకీయం 
Read More...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

పెద్ది విగ్రహం తొలగింపు

- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
రాజకీయం 
Read More...
పెద్ది విగ్రహం తొలగింపు

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత