ఆగని ఇసుక జీరో దందా!

ఆగని ఇసుక జీరో దందా!

  • కాటారంలో ఓ లారీని పట్టుకున్న పోలీసులు
  • జీరో ఇసుకను వదిలేసి పోయిన ఇసుక స్మగ్లర్లు 
  • చర్చనీయాంశమైన ఇసుక అక్రమ రవాణా 

ఆగని ఇసుక జీరో దందా! 

అక్షర దర్బార్​, కాటారంః
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లో​ నడుస్తున్న ఇసుక రీచుల్లో జీరో దందా ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట ఇసుక లారీలు పట్టుబడ్డట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నప్పటికినీ ఇసుక స్మగ్లర్లు అవేమి పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులకు తామిచ్చే ధనబలమో, లీడర్ల అండ బలమో తెలియదు కాని ఇసుక స్మగ్లర్లు దర్జాగా ఇసుక దందాను సాగిస్తున్న తీరు  సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.ఓ పరంగా ఆయా శాఖల అధికారులు ఇసుక స్మగర్లకు నడుపుకోండని మౌఖిక సంఘీభావం తెలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* పల్గుల క్వారీ నుండి 3 లారీలు..?

మహదేవపూర్​ సమీప గ్రామాలకు చెందిన ఇసుక లారీల యజమానులు పల్గుల క్వారీ నుండి  3 ఇసుక లారీల్లో జీరో ఇసుక నింపుకుని ఎస్కార్ట్ గా బయలుదేరినట్లు సమాచారం .ముందుగా ఓ ఇసుక లారీ కాటారం చెక్​ పోస్టు వద్దకు చేరుకోగా ఎలాంటి వేబిల్లు లేకపోవడంతో పోలీసులు పట్టుకున్నారు.అయితే వెనుకాలే వస్తున్న మరో రెండు లారీలకు పట్టుబడిన లారీ ఓనర్​ కమ్​ డ్రైవర్​ పట్టుబడ్డానని మీరు అటునుండి అటే పారిపోండని సమాచారం ఇచ్చాడు.దీంతో అప్రమత్తమైన సదరు ఇసుక లారీల ఓనర్లు,డ్రైవర్లు వెనక్కి తిప్పుకుని మహదేవపూర్​లోని అయ్యప్ప టెంపుల్​ వద్ద ప్రధాన రహదారి పక్కనే అన్లోడ్​ చేసి పారిపోయారు.ఈ విషయమై సంబంధిత ఓ పోలిస్​ అధికారికి వివరణ అడగ్గా బ్రేక్​ ఫెయులవ్వడంతో ఇసుకను అన్లోడ్​ చేసినట్లు చెప్పడం గమనార్హం.

Tags:

ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు   కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్ అక్షరదర్బార్, పరకాల : ఆర్టీసీ డ్రైవర్ శంకర్...
Read More...
ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
క్రైమ్ 
Read More...
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. - చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు
క్రైమ్ 
Read More...
లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం రైతులు దళాలను నమ్మొద్దు..   ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి అక్షరదర్బార్, పరకాల:నడికూడ మండల కేంద్రంలో...
Read More...
మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్...
క్రైమ్ 
Read More...
భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత