అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
 
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
 
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
 
అక్షర దర్బార్,శాయంపేట 
 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఖండించారు. ఆదివారం నాడు శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంటులో అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే, అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడటం దేశ ప్రతిష్టతకు మంచిది కాదని అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.
 
అనంతరం 19 మంది సీఎంఆర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదికలో ఉచిత వరి విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. 
 
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
 
 మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో రైతు వేదిక ముందే ఓ మాజీ ప్రజా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. అయితే  సబ్సిడీ విత్తనాల పంపిణీలో నాయకుల పేర్లు ఎంపిక చేయడం సరేంది కాదని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ను కొంతమంది గ్రామానికి చెందిన నాయకులు నిలదీశారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం  చోటుచేసుకోని  అక్కడినుండి  వెళ్ళిపోయారు.
 
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
 
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా ఆదివారం నాడు పంపిణీ చేయడం జరిగింది. ఉచిత వరి విత్తనాలను ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని విలేకరులుగా అడగగా  అంతా అధికార పార్టీ నాయకులు వారి ఇష్టం. అధికార పార్టీ నాయకులు చెప్పింది చేయకపోతే మేము పనులు చేయలేమని గతంలో కూడా బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు నడుచుకున్నాం. మా చేతుల్లో ఏమీ లేదు అని మండల వ్యవసాయ శాఖ అధికారి గంగా జమున అనడం కొసమెరుపు.IMG-20241222-WA0764
Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర