అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
 
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
 
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
 
అక్షర దర్బార్,శాయంపేట 
 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఖండించారు. ఆదివారం నాడు శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంటులో అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే, అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడటం దేశ ప్రతిష్టతకు మంచిది కాదని అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.
 
అనంతరం 19 మంది సీఎంఆర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదికలో ఉచిత వరి విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. 
 
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
 
 మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో రైతు వేదిక ముందే ఓ మాజీ ప్రజా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. అయితే  సబ్సిడీ విత్తనాల పంపిణీలో నాయకుల పేర్లు ఎంపిక చేయడం సరేంది కాదని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ను కొంతమంది గ్రామానికి చెందిన నాయకులు నిలదీశారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం  చోటుచేసుకోని  అక్కడినుండి  వెళ్ళిపోయారు.
 
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
 
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా ఆదివారం నాడు పంపిణీ చేయడం జరిగింది. ఉచిత వరి విత్తనాలను ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని విలేకరులుగా అడగగా  అంతా అధికార పార్టీ నాయకులు వారి ఇష్టం. అధికార పార్టీ నాయకులు చెప్పింది చేయకపోతే మేము పనులు చేయలేమని గతంలో కూడా బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు నడుచుకున్నాం. మా చేతుల్లో ఏమీ లేదు అని మండల వ్యవసాయ శాఖ అధికారి గంగా జమున అనడం కొసమెరుపు.IMG-20241222-WA0764
Tags:

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.    తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.      డాక్టర్   అక్షర...
Read More...
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.    అక్షర దర్బార్, పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను...
Read More...
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.