అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
 
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
 
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
 
అక్షర దర్బార్,శాయంపేట 
 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఖండించారు. ఆదివారం నాడు శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంటులో అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే, అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడటం దేశ ప్రతిష్టతకు మంచిది కాదని అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.
 
అనంతరం 19 మంది సీఎంఆర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదికలో ఉచిత వరి విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. 
 
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
 
 మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో రైతు వేదిక ముందే ఓ మాజీ ప్రజా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. అయితే  సబ్సిడీ విత్తనాల పంపిణీలో నాయకుల పేర్లు ఎంపిక చేయడం సరేంది కాదని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ను కొంతమంది గ్రామానికి చెందిన నాయకులు నిలదీశారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం  చోటుచేసుకోని  అక్కడినుండి  వెళ్ళిపోయారు.
 
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
 
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా ఆదివారం నాడు పంపిణీ చేయడం జరిగింది. ఉచిత వరి విత్తనాలను ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని విలేకరులుగా అడగగా  అంతా అధికార పార్టీ నాయకులు వారి ఇష్టం. అధికార పార్టీ నాయకులు చెప్పింది చేయకపోతే మేము పనులు చేయలేమని గతంలో కూడా బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు నడుచుకున్నాం. మా చేతుల్లో ఏమీ లేదు అని మండల వ్యవసాయ శాఖ అధికారి గంగా జమున అనడం కొసమెరుపు.IMG-20241222-WA0764
Tags:

ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...

ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు... స్వచ్చందంగా మూసివేతకు డీలర్లకు విజ్ఞప్తి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి అక్షరదర్బార్, హనుమకొండ:వరంగల్ జిల్లా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్...
Read More...
ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...

ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు   కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్ అక్షరదర్బార్, పరకాల : ఆర్టీసీ డ్రైవర్ శంకర్...
Read More...
ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
క్రైమ్ 
Read More...
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. - చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు
క్రైమ్ 
Read More...
లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం రైతులు దళాలను నమ్మొద్దు..   ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి అక్షరదర్బార్, పరకాల:నడికూడ మండల కేంద్రంలో...
Read More...
మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం