గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన శాయంపేట పోలీసులు
అక్షర దర్బార్, శాయంపేట
22,500/- రూపాయల విలువ గల వివిధ కంపెనీలకు చెందిన గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన శాయంపేట పోలీసులు. వివరాల్లోకి వెళితే.. శాయంపేట ఎస్సై పరమేష్ కథనం ప్రకారం వివిధ గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా వసంతపూర్ గ్రామానికి చెందిన కొసరి గోపాల్ అను అతను తన కిరాణం షాపులో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్ముచున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు అతని కిరణం షాపు వద్దకు వెళ్లేసరికి పోలీసువారిని చూసి పారిపోతుండగా అతడిని పట్టుకొని అతని కిరాణం షాపులో దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి సదరు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాయంపేట ఎస్సై తెలిపారు. ఇందులో ఎస్ఐతో పాటు సిబ్బంది సాగర్, ఖాళీద్ పాల్గొన్నారు.
