ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, న్యాయమూర్తి తిరుపతి చిత్రపటాలకు ఓ వ్య‌క్తి పాలాభిషేకం చేసి త‌న అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తానంటూ దళారి తీసుకున్న రెండు లక్షల  రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్ లో ఇరువురి కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినందుకు కృత‌జ్ఞ‌త‌గా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..  కురవి మండలం గుండ్రాతి మడుగు (విలేజ్)కు చెందిన పత్తి  వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం మేడ్చల్‌కు చెందిన ఓ వ్య‌క్తికి రూ. 2 లక్షలు ఇచ్చాడు. సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. కురవి ఎస్ఐ సతీష్ బాధ్యతాయుతంగా స్పందించి దళారిని పోలీస్  స్టేషన్‌కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశాడు. ఈమేర‌కు జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఇరువురి కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చి డబ్బులను ఇప్పించి కేసు పరిష్కరించారు. పోయాయనుకున్న రెండు లక్షల రూపాయలను తిరిగి తనకు అందేలా చేసిన జిల్లా ఎస్పీ, న్యాయమూర్తిల చిత్రపటాలకు మహబూబాబాద్‌లోని కోర్టు ఎదుట బాధితుడు పత్తి వెంకన్న పాలాభిషేకం నిర్వహించి తన కృతజ్ఞత చాటుకున్నారు. 

Tags:

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బిజెపి మండల అధ్యక్షుడు...
Read More...
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం     శాయంపేట, అక్షర దర్బార్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాయంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి జెండా ఆవిష్కరించారు....
Read More...
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు    అక్షర దర్బార్, శాయంపేట : ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...
Read More...
ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .    - ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"    - రైతులపై కేసులు వద్దు.    - పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.    అక్షరదర్బార్, పరకాల:...
Read More...
రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....   – ప్రజల విజ్ఞప్తి.    అక్షర దర్బార్, పరకాల: నడికూడ మండలంలోని కంటత్మకూర్ వాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వాగు ఉధృతంగా పొంగిపొర్లి...
Read More...
కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....