ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, న్యాయమూర్తి తిరుపతి చిత్రపటాలకు ఓ వ్య‌క్తి పాలాభిషేకం చేసి త‌న అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తానంటూ దళారి తీసుకున్న రెండు లక్షల  రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్ లో ఇరువురి కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినందుకు కృత‌జ్ఞ‌త‌గా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..  కురవి మండలం గుండ్రాతి మడుగు (విలేజ్)కు చెందిన పత్తి  వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం మేడ్చల్‌కు చెందిన ఓ వ్య‌క్తికి రూ. 2 లక్షలు ఇచ్చాడు. సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. కురవి ఎస్ఐ సతీష్ బాధ్యతాయుతంగా స్పందించి దళారిని పోలీస్  స్టేషన్‌కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశాడు. ఈమేర‌కు జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఇరువురి కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చి డబ్బులను ఇప్పించి కేసు పరిష్కరించారు. పోయాయనుకున్న రెండు లక్షల రూపాయలను తిరిగి తనకు అందేలా చేసిన జిల్లా ఎస్పీ, న్యాయమూర్తిల చిత్రపటాలకు మహబూబాబాద్‌లోని కోర్టు ఎదుట బాధితుడు పత్తి వెంకన్న పాలాభిషేకం నిర్వహించి తన కృతజ్ఞత చాటుకున్నారు. 

Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు